CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి.. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా పెన్షన్ అందించనున్నారు.. ఇక, బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు.. ప్రతీ నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఏవైనా సెలవులు, ఆదివారం వచ్చినా.. ముందు రోజే మెజార్టీగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు.. ఇక, జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్క రోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తోంది కూటమి సర్కార్.. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుటుంబాలు ఎంపిక చేసింది ప్రభుత్వం..
Read Also: Astrology: మే 31, శనివారం దినఫలాలు
కాగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచింది.. ఇక, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం.. ఈ కార్యక్రమంలో ప్రతీ నెల ఏదో ఒక గ్రామంలో సీఎం చంద్రబాబు భాగస్వాములు అవుతూ వస్తున్నారు.. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి.. వారి బాగోగులు తెలుసుకూంట పెన్షన్లు అందిస్తున్నారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..