CM Chandrababu: మరో కీలక సమావేశానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు.. 12న హెచ్వోడీలు, సెక్రటరీలు, కలెక్టర్లతో భేటీ..
- ఈ నెల 12 సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
- అన్ని శాఖల హెచ్వోడీలు, సెక్రటరీలు, అన్ని జిల్లాల కలెక్టర్లతో భేటీ..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై మరోసారి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన అన్ని శాఖల హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (HODs), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంబంధించిన స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) లక్ష్యాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా అమలవుతున్న సేవలు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలు పురోగతిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు ఈ భేటీకి అన్ని శాఖల మంత్రులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టమైన సూచనలు జారీ అయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాల సమన్వయం, జిల్లాల వారీగా పెండింగ్ పనుల వేగవంతం, ప్రజలకు సేవలు మరింత చేరువయ్యేలా తీసుకోవాల్సిన పరిపాలనా నిర్ణయాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: India-US: ‘‘మోడీ ట్రంప్కు ఫోన్ చేయలేదు’’ వ్యాఖ్యలపై స్పందించిన భారత్..
Also Read
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
- CM Chandrababu: నేను దక్షిణాది రాష్ట్రాల వైపే మాట్లాడుతున్నా.. అందుకే ప్రధాని మోడీకి పూర్తి మద్దతు..
- AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
- Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
సీఎం చంద్రబాబు నాయుడు ఈ సమావేశం వర్చువల్ మోడ్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక శాఖలకు సంబంధించిన ప్రజా సేవలు, డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం.. ఇప్పుడు పరిపాలనా యంత్రాంగాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి, లక్ష్యాల సాధనపై స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలపై రాజకీయ స్థాయిలో క్రెడిట్ వార్ జరుగుతున్న తరుణంలో.. సీఎం నేరుగా అధికారులతో సమావేశం నిర్వహించడం, ప్రాధాన్య అంశాలపై పురోగతిని సమీక్షించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, ప్రభుత్వ నిర్ణయాల అమలులో వేగం పెంచడం, అలాగే 2026–27 నాటికి GSDP వృద్ధి లక్ష్యాలను చేరుకోవడమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పరిపాలనలో సమన్వయం, వేగం, పారదర్శకత కీలకమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. ఈ భేటీ ద్వారా అధికార యంత్రాంగానికి మరోసారి స్పష్టమైన రోడ్మ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?