PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- దేశాభివృద్ధికి బలమైన నాయకత్వమని వ్యాఖ్య..
- ‘నేషన్ ఫస్ట్’తో భారత్కు కొత్త దిశ..
- వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు మోడీ నాయకత్వమే బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi 12 Years Governance: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ జాతీయ దినపత్రికలో ప్రత్యేక ఎడిటోరియల్ వ్యాసం రచించారు. ప్రధానిగా 4,399 రోజుల పాటు సేవలందించి భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన సందర్భంగా ఈ వ్యాసాన్ని రాసినట్లు పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రధాని మోడీ చేపట్టిన పరిపాలన దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని చంద్రబాబు తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. గత 12 ఏళ్లలో మోడీ అమలు చేసిన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయని వివరించారు.
ప్రపంచ దేశాల మధ్య భారతదేశ ప్రతిష్ఠను పెంచడంలో ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రస్తుత జియోపాలిటికల్ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల విషయంలో ప్రపంచ దేశాలు భారత్కు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాల వెనుక మోడీ నాయకత్వం ముఖ్య కారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో మోడీ చేసిన కృషిని కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూనే దేశ ప్రతిష్ఠను పెంచడంలో ఆయన విజయం సాధించారని తెలిపారు.
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ అనుసరించిన వ్యూహాత్మక చర్యలను తన వ్యాసంలో విశ్లేషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, తయారీ రంగ ప్రోత్సాహం వంటి అంశాలు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలబెట్టాలనే లక్ష్యంతో మోడీ ముందుకు సాగుతున్నారని వివరించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను ప్రజల జీవితాలకు మరింత చేరువ చేయడంతో పాటు పాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంలో మోడీ ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. ఇక, వ్యాసం ముగింపులో, ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలను తప్పకుండా సాధిస్తుందనే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంస్కరణలు, సాంకేతిక పురోగతి మరియు ప్రపంచ స్థాయిలో భారత ప్రభావాన్ని మరింత పెంచే దిశగా నరేంద్ర మోడీ నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!