PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- దేశాభివృద్ధికి బలమైన నాయకత్వమని వ్యాఖ్య..
- ‘నేషన్ ఫస్ట్’తో భారత్కు కొత్త దిశ..
- వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు మోడీ నాయకత్వమే బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi 12 Years Governance: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ జాతీయ దినపత్రికలో ప్రత్యేక ఎడిటోరియల్ వ్యాసం రచించారు. ప్రధానిగా 4,399 రోజుల పాటు సేవలందించి భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన సందర్భంగా ఈ వ్యాసాన్ని రాసినట్లు పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రధాని మోడీ చేపట్టిన పరిపాలన దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని చంద్రబాబు తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. గత 12 ఏళ్లలో మోడీ అమలు చేసిన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయని వివరించారు.
ప్రపంచ దేశాల మధ్య భారతదేశ ప్రతిష్ఠను పెంచడంలో ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రస్తుత జియోపాలిటికల్ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల విషయంలో ప్రపంచ దేశాలు భారత్కు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాల వెనుక మోడీ నాయకత్వం ముఖ్య కారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో మోడీ చేసిన కృషిని కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూనే దేశ ప్రతిష్ఠను పెంచడంలో ఆయన విజయం సాధించారని తెలిపారు.
Also Read
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ అనుసరించిన వ్యూహాత్మక చర్యలను తన వ్యాసంలో విశ్లేషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, తయారీ రంగ ప్రోత్సాహం వంటి అంశాలు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలబెట్టాలనే లక్ష్యంతో మోడీ ముందుకు సాగుతున్నారని వివరించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను ప్రజల జీవితాలకు మరింత చేరువ చేయడంతో పాటు పాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంలో మోడీ ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. ఇక, వ్యాసం ముగింపులో, ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలను తప్పకుండా సాధిస్తుందనే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంస్కరణలు, సాంకేతిక పురోగతి మరియు ప్రపంచ స్థాయిలో భారత ప్రభావాన్ని మరింత పెంచే దిశగా నరేంద్ర మోడీ నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!