Collectors’ Conference: ఆరు జిల్లాల కలెక్టర్ల బెస్ట్ ప్రాక్టీసెస్.. రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సీఎం ఆదేశాలు..
- 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కొత్త విధానాన్ని అవలంభించిన సీఎం చంద్రబాబు..
- వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను ప్రజెంటేషన్ ఇప్పించిన సీఎం..
- ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collectors’ Conference: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాలనను మరింత ప్రజోపయోగంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు తొలిసారిగా కొత్త విధానాన్ని అవలంభించారు. సాధారణ సమీక్షలకు భిన్నంగా, ఆయా జిల్లాల్లో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కలెక్టర్లే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చేశారు. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
Read Also: Muslims vs RSS: ముస్లింలు సూర్య నమస్కారాలు, నదులను పూజించాలి.. ఆర్ఎస్ఎస్ నేత హాట్ కామెంట్స్
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం, ఏలూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను వివరించారు. వీటిలో కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉన్నాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించిన ‘ప్రాజెక్ట్ నిర్మాణ్’ గురించి వివరించారు. పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి విద్యార్థులు పరిశుభ్రత, హైజినిక్ అలవాట్లు అలవర్చుకునేలా రూపొందించిన ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వీ నాటుసారా తయారీదారుల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేలా, వారిని మైక్రో ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో రూపొందించిన ‘ప్రాజెక్ట్ మార్పు’ కార్యక్రమాన్ని వివరించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా రైతుల సాధికారత, ఆర్థిక లబ్ది, వ్యవసాయంలో ఉత్తమ విధానాల పాటన లక్ష్యంగా చేపట్టిన ‘ఛాంపియన్ ఫార్మర్స్’ కార్యక్రమాన్ని వివరించారు.
కడప జిల్లా కలెక్టర్ సీహెచ్ శ్రీధర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లు గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్కు తావు లేకుండా డిజిటలైజేషన్, ఏఐ వినియోగంతో రూపొందించిన వినూత్న ప్రాజెక్టును వివరించారు. జిల్లాల్లో ప్రజలకు మెరుగైన సేవలందించడంలో విశేష కృషి చేస్తున్న కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. రొటీన్ చర్చలకే పరిమితం కాకుండా ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలపై కాన్ఫరెన్సులో చర్చ జరగడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి మరిన్ని వినూత్న ఆలోచనలు, ప్రజోపయోగ కార్యక్రమాలతో రావాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ప్రోత్సహించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!