Muslims vs RSS: ముస్లింలు సూర్య నమస్కారాలు, నదులను పూజించాలి.. ఆర్ఎస్ఎస్ నేత హాట్ కామెంట్స్
- తీవ్ర దుమారం రేపుతున్న ఆర్ఎస్ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే వ్యాఖ్యలు..
- ముస్లింలు సూర్య నమస్కారాలు, నదులను పూజించాలి.. మసీదులకు వెళ్లకుండా ఎవరు అడ్డుకోరు..
- ప్రతి ఒక్కరు తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది.. మతాలకంటే “మానవ ధర్మం” ముఖ్యం: హోసబలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslims vs RSS: ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. హిందూ మతం “సర్వోన్నతమైనది”.. భారతదేశంలోని ముస్లింలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం నదులు, సూర్యుడిని ఆరాధించాలని సూచించారు. అలాగే, ముస్లిం సోదరులు సూర్య నమస్కారం చేస్తే వారికి ఎలాంటి నష్టం జరగదని, అలా చేసినంత మాత్రాన మసీదుకు వెళ్లకుండా ఎవరు అడ్డుకోరని ఆయన అన్నారు. సూర్య నమస్కారం ఆరోగ్యానికి మేలు చేసే యోగ సాధనంగా అభివర్ణించారు. ప్రార్థనలు చేసే వారు ప్రాణాయామం చేయడంలో తప్పేముందని ప్రశ్నించిన ఆయన, నమాజ్ను వదిలేయమని చెప్పడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది.. మతాలకంటే ముందు “మానవ ధర్మం” ముఖ్యమని హోసబలే వ్యాఖ్యానించారు.
Read Also: Vicky Kaushal: శంభాజీ మహరాజ్ పాత్ర కోసం విక్కీ ఇంత త్యాగం చేశాడా.. !
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
కాగా, ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ విభజన అంశాన్ని ప్రస్తావించిన హోసబలే.. పార్టిషన్ సమయంలో హిందువులకు ఏమి జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. అలాగే, హిందూ తత్వశాస్త్రంలో ప్రకృతి, జీవజాలంపై అహింసను బోధిస్తుంది, దేవతల పేర్లను పిల్లలకు పేర్లు పెట్టుకునే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. అయితే, “హిందూ మతం సర్వోన్నతమైనది” అనే వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇవి ఒక మతాన్ని మరొక మతంపై ఆధిపత్యంగా చూపిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, “మసీదుకు వెళ్లడాన్ని ఆపం” అనే వ్యాఖ్యల్లో ముస్లింలను హిందూ మెజారిటీ సంస్కృతిలో కలిపివేయాలనే భావన ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. హిందూ ఆచారాలను కేవలం మతపరమైనవిగా కాకుండా, ఆరోగ్యం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ పేరుతో సామాన్యమైన పౌర సంస్కృతిగా చూపించాలని ఆర్ఆర్ ప్రయత్నిస్తుందని మరికొందరు విమర్శిస్తున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..