CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Anantapur Visit: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
* ఉదయం 09:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం బయలుదేరుతారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి స్వాగతం స్వీకరిస్తారు.
Also Read
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
* ఉదయం 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి యాడికి గ్రామ మార్కెట్ యార్డ్లో నిర్వహించే “ప్రజా వేదిక” సమావేశానికి చేరుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారు.
* మధ్యాహ్నం 01:00 నుంచి 01:30 వరకు సమయం రిజర్వ్ చేయబడింది. ఆ తర్వాత 01:30 గంటలకు ప్రజా వేదిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం అక్కడి నుంచి బయలుదేరి 01:40 గంటలకు వేములపాడు గ్రామానికి చేరుకుంటారు.
* వేములపాడు వద్ద ఉన్న పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని మధ్యాహ్నం 01:40 నుంచి 02:30 వరకు సందర్శిస్తారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణకు సంబంధించిన పనులు, ముఖ్యంగా PMDS మరియు హాఫ్ మూన్ మోడల్ విధానాలను పరిశీలిస్తారు. అనంతరం 02:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 02:40 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుంటారు.
* మధ్యాహ్నం 02:40 నుంచి సాయంత్రం 04:10 వరకు వేములపాడులో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో (Cadre Meeting) సీఎం పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.
* చివరగా సాయంత్రం 04:20 గంటలకు వేములపాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 06:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం ప్రజల సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి పనులను సమీక్షించడం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!