CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Anantapur Visit: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
* ఉదయం 09:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం బయలుదేరుతారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి స్వాగతం స్వీకరిస్తారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
* ఉదయం 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి యాడికి గ్రామ మార్కెట్ యార్డ్లో నిర్వహించే “ప్రజా వేదిక” సమావేశానికి చేరుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారు.
* మధ్యాహ్నం 01:00 నుంచి 01:30 వరకు సమయం రిజర్వ్ చేయబడింది. ఆ తర్వాత 01:30 గంటలకు ప్రజా వేదిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం అక్కడి నుంచి బయలుదేరి 01:40 గంటలకు వేములపాడు గ్రామానికి చేరుకుంటారు.
* వేములపాడు వద్ద ఉన్న పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని మధ్యాహ్నం 01:40 నుంచి 02:30 వరకు సందర్శిస్తారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణకు సంబంధించిన పనులు, ముఖ్యంగా PMDS మరియు హాఫ్ మూన్ మోడల్ విధానాలను పరిశీలిస్తారు. అనంతరం 02:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 02:40 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుంటారు.
* మధ్యాహ్నం 02:40 నుంచి సాయంత్రం 04:10 వరకు వేములపాడులో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో (Cadre Meeting) సీఎం పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.
* చివరగా సాయంత్రం 04:20 గంటలకు వేములపాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 06:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం ప్రజల సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి పనులను సమీక్షించడం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
-
LENIN : అఖిల్ ‘లెనిన్’ ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!