CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Anantapur Visit: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు, ప్రజలతో నేరుగా మమేకమయ్యే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.
* ఉదయం 09:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం బయలుదేరుతారు. అనంతరం ఉదయం 11:10 గంటలకు అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు గ్రామంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ 10 నిమిషాల పాటు ప్రజా ప్రతినిధులు, అధికారుల నుంచి స్వాగతం స్వీకరిస్తారు.
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
* ఉదయం 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి యాడికి గ్రామ మార్కెట్ యార్డ్లో నిర్వహించే “ప్రజా వేదిక” సమావేశానికి చేరుకుంటారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటారు.
* మధ్యాహ్నం 01:00 నుంచి 01:30 వరకు సమయం రిజర్వ్ చేయబడింది. ఆ తర్వాత 01:30 గంటలకు ప్రజా వేదిక సమావేశం ముగిసిన అనంతరం సీఎం అక్కడి నుంచి బయలుదేరి 01:40 గంటలకు వేములపాడు గ్రామానికి చేరుకుంటారు.
* వేములపాడు వద్ద ఉన్న పెండేకల్లు రిజర్వాయర్ తీర ప్రాంతాన్ని మధ్యాహ్నం 01:40 నుంచి 02:30 వరకు సందర్శిస్తారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణకు సంబంధించిన పనులు, ముఖ్యంగా PMDS మరియు హాఫ్ మూన్ మోడల్ విధానాలను పరిశీలిస్తారు. అనంతరం 02:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 02:40 గంటలకు హెలిప్యాడ్కు చేరుకుంటారు.
* మధ్యాహ్నం 02:40 నుంచి సాయంత్రం 04:10 వరకు వేములపాడులో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో (Cadre Meeting) సీఎం పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.
* చివరగా సాయంత్రం 04:20 గంటలకు వేములపాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా తిరుగు ప్రయాణం ప్రారంభించి, సాయంత్రం 06:00 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటనలో సీఎం ప్రజల సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి పనులను సమీక్షించడం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!