CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం ఫోకస్.. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే..!
- ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్గా దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు..
- ఏపీలో రెండు గ్రేడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు..
- ఈ నెల 27వ తేదీన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా దృష్టి పెట్టారు.. ఏపీలో రెండు గ్రేడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇంచార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు పెట్టారు… ఎమ్మెల్యేలు.. కూటమి నేతలు కలిసి పని చెయ్యాలని. కూడా మంత్రులు చెబుతున్నారు.. తూర్పుగోదావరి – పశ్చిమగోదావరి.. కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రేడ్యుయేట్ ఎన్నికలతో పాటు.. విశాఖ – శ్రీకాకుళం – విజయనగరం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మంత్రులు నారాయణ.. నిమ్మల రామానాయుడు.. అనగాని సత్యప్రసాద్.. గొట్టిపాటి రవి ఇప్పటికే.. ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
అయితే, మంత్రులతో పాటు కూటమి నేతలు కలిసి ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని.. అదే విధంగా ప్రభుత్వం.. యువతకు చేస్తున్న కార్యక్రమాలు.. ఉద్యోగాల కల్పన.. గ్రేడ్యుయేట్ ఓటర్లకి మంత్రులు చెప్పాలంటున్నారు సీఎం చంద్రబాబు… మంత్రులు కూడా ఇదే తరహా ప్రచారంపై దృష్టి పెట్టారు. కూటమి నేతలు కూడా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.. జనసేన. ఈ నెల 16, 17 తేదీల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహిస్తున్నారు.. అయితే. జనసేన విడిగా ఈ సమావేశం నిర్వహిస్తోంది… మంత్రులతో త్వరలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రుల కు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!