CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం ఫోకస్.. ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందే..!
- ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్గా దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు..
- ఏపీలో రెండు గ్రేడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు..
- ఈ నెల 27వ తేదీన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్..
CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా దృష్టి పెట్టారు.. ఏపీలో రెండు గ్రేడ్యుయేట్.. ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఇంచార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో సమావేశాలు పెట్టారు… ఎమ్మెల్యేలు.. కూటమి నేతలు కలిసి పని చెయ్యాలని. కూడా మంత్రులు చెబుతున్నారు.. తూర్పుగోదావరి – పశ్చిమగోదావరి.. కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రేడ్యుయేట్ ఎన్నికలతో పాటు.. విశాఖ – శ్రీకాకుళం – విజయనగరం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. మంత్రులు నారాయణ.. నిమ్మల రామానాయుడు.. అనగాని సత్యప్రసాద్.. గొట్టిపాటి రవి ఇప్పటికే.. ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
- School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
అయితే, మంత్రులతో పాటు కూటమి నేతలు కలిసి ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని.. అదే విధంగా ప్రభుత్వం.. యువతకు చేస్తున్న కార్యక్రమాలు.. ఉద్యోగాల కల్పన.. గ్రేడ్యుయేట్ ఓటర్లకి మంత్రులు చెప్పాలంటున్నారు సీఎం చంద్రబాబు… మంత్రులు కూడా ఇదే తరహా ప్రచారంపై దృష్టి పెట్టారు. కూటమి నేతలు కూడా జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు.. జనసేన. ఈ నెల 16, 17 తేదీల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహిస్తున్నారు.. అయితే. జనసేన విడిగా ఈ సమావేశం నిర్వహిస్తోంది… మంత్రులతో త్వరలో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.. మొత్తానికి సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రుల కు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!