Andhra Pradesh: ఏపీలో భూముల ధరల పెంపు..! క్లారిటీ వచ్చేది అప్పుడే..
- ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ ధరల పెంపుపై జోరుగా ప్రచారం..
- రిజిస్ట్రేషన్ల కోసం పరుగులు పెడుతున్న ప్రజలు..
- రద్దీగా మారిపోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..
- ఈ నెల 30వ తేదీన సీసీఎల్ఏలో కీలక సమావేశం..
- ఆ రోజే భూముల మార్కెట్ ధరల పెంపుపై రానున్న క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది.. మార్కెట్ రేట్ పెరిగితే ఆటోమాటిక్ గా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి.. దీంతో కొంతమంది ప్రజలు కూడా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో తొందర పడుతున్నారు. అయితే, భూముల మార్కెట్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి బాగా వచ్చినట్టు సమాచారం.. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అసలే రియల్ వ్యాపారాలు సరిగ్గా లేని సమయంలో మార్కెట్ రేట్ పెరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవంటూన్నారు.
Read Also: Wedding: పెళ్లిలో బంధువులు అత్యుత్సాహం.. కోపంతో పూజారి ఏం చేశాడంటే..! వీడియో వైరల్
Also Read
- 20 Lakh Jobs in AP: 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం.. యువతకు సీఎం భరోసా
- CM Chandrababu: హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
- CM Chandrababu: వికసితం నుంచి వైభవం వైపు.. ఆంధ్రప్రదేశ్పై చంద్రబాబు భారీ లక్ష్యం
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
ప్రస్తుతం ఏపీలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి.. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.. భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఎంతోమంది ఈ సదస్సులో వారి సమస్యలు చెబుతున్నాఉ.. దీంతో, ఈ టైంలో భూముల మార్కెట్ విలువ పెరిగితే ఇబ్బంది అని ప్రభుత్వం కూడా వెనకడుగు వేస్తోంది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ధరలు పెంచాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఇక, ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఆర్ధిక శాఖ. రెవెన్యూశాఖ అధికారులు భూముల మార్కెట్ ధరలు పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని సమాచారం. అయితే, సీఎం కూడా ఈ ప్రతిపాదన అమలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.. మొదట అంగీకరించినా తర్వాత వస్తున్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకుని సీఎం కూడా అధికారులను నివేదిక సిద్ధం చెయ్యమన్నట్టు తెలుస్తోంది.
Read Also: Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
అయితే, ఈ నెల 30వ తేదీన సీసీఎల్ఏలో కీలక సమావేశం జరగనుంది. జోనల్ రెవెన్యూ సమావేశంలో కొన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. భూముల మార్కెట్ ధరలపై చర్చిస్తారు. అయితే, ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో నివేదిక సిద్ధం అయ్యింది.. ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో భూముల మార్కెట్ ధర పెంచాలా వద్ద అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. 30న జరిగే సమావేశంలో భూముల మార్కెట్ ధరల పెంపు విషయంలో అధికారులు చర్చించిన తర్వాత నివేదిక సిద్ధం చేస్తారు. నివేదిక సీఎంకు అందించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం మళ్లీ సమగ్రంగా చర్చించిన తర్వాత భూముల ధరలు పెంచడంపై దృష్టి పెట్టనున్నారు.. ఇప్పటికే ఒక వైపు విద్యుత్తు ఛార్జీలపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది..
తాజావార్తలు
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!