Andhra Pradesh: ఏపీలో భూముల ధరల పెంపు..! క్లారిటీ వచ్చేది అప్పుడే..
- ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ ధరల పెంపుపై జోరుగా ప్రచారం..
- రిజిస్ట్రేషన్ల కోసం పరుగులు పెడుతున్న ప్రజలు..
- రద్దీగా మారిపోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు..
- ఈ నెల 30వ తేదీన సీసీఎల్ఏలో కీలక సమావేశం..
- ఆ రోజే భూముల మార్కెట్ ధరల పెంపుపై రానున్న క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది.. మార్కెట్ రేట్ పెరిగితే ఆటోమాటిక్ గా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి.. దీంతో కొంతమంది ప్రజలు కూడా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో తొందర పడుతున్నారు. అయితే, భూముల మార్కెట్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి బాగా వచ్చినట్టు సమాచారం.. ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇతర ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అసలే రియల్ వ్యాపారాలు సరిగ్గా లేని సమయంలో మార్కెట్ రేట్ పెరిగితే మరిన్ని ఇబ్బందులు తప్పవంటూన్నారు.
Read Also: Wedding: పెళ్లిలో బంధువులు అత్యుత్సాహం.. కోపంతో పూజారి ఏం చేశాడంటే..! వీడియో వైరల్
Also Read
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
ప్రస్తుతం ఏపీలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి.. ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.. భూ సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఎంతోమంది ఈ సదస్సులో వారి సమస్యలు చెబుతున్నాఉ.. దీంతో, ఈ టైంలో భూముల మార్కెట్ విలువ పెరిగితే ఇబ్బంది అని ప్రభుత్వం కూడా వెనకడుగు వేస్తోంది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ధరలు పెంచాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఇక, ప్రభుత్వానికి ఆదాయం పెంచడానికి ఆర్ధిక శాఖ. రెవెన్యూశాఖ అధికారులు భూముల మార్కెట్ ధరలు పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని సమాచారం. అయితే, సీఎం కూడా ఈ ప్రతిపాదన అమలుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.. మొదట అంగీకరించినా తర్వాత వస్తున్న వ్యతిరేకత దృష్టిలో పెట్టుకుని సీఎం కూడా అధికారులను నివేదిక సిద్ధం చెయ్యమన్నట్టు తెలుస్తోంది.
Read Also: Virat Kohli: ఆస్ట్రేలియా అభిమానులపై గుస్సాయించిన విరాట్ కోహ్లీ.. (వీడియో)
అయితే, ఈ నెల 30వ తేదీన సీసీఎల్ఏలో కీలక సమావేశం జరగనుంది. జోనల్ రెవెన్యూ సమావేశంలో కొన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. భూముల మార్కెట్ ధరలపై చర్చిస్తారు. అయితే, ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో నివేదిక సిద్ధం అయ్యింది.. ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో భూముల మార్కెట్ ధర పెంచాలా వద్ద అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. 30న జరిగే సమావేశంలో భూముల మార్కెట్ ధరల పెంపు విషయంలో అధికారులు చర్చించిన తర్వాత నివేదిక సిద్ధం చేస్తారు. నివేదిక సీఎంకు అందించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం మళ్లీ సమగ్రంగా చర్చించిన తర్వాత భూముల ధరలు పెంచడంపై దృష్టి పెట్టనున్నారు.. ఇప్పటికే ఒక వైపు విద్యుత్తు ఛార్జీలపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!