Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై సర్కార్ కీలక నిర్ణయం..
- మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం..
- రెండు.. మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madanapalle Sub Collector Office incident: ఆంధ్రప్రదేశ్లో మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన సంచలనం సృష్టించింది.. అయితే, ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక దస్త్రాల్ని కాల్చివేశారని పోలీసులు తేల్చారు.. దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనను సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.. మదనపల్లి ఫైల్స్ ఘటనలో రోజు రోజుకూ కొత్త అంశాలు వెలుగులోకి వస్తుండడంతో సీఐడీ అయితేనే మేలని భావిస్తోంది సర్కార్.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండడంతో సీఐడీకి మదనపల్లి ఫైల్స్ కేసు బదలాయించాలనే నిర్ణయానికి వచ్చింది..
Read Also: NTR Bharosa Pensions: రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. 2.30 గంటల్లోనే..!
Also Read
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ఇక, ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు.. సీఎం ఆదేశాలతో డీజీపీ సహా కీలక అధికారులు రంగంలోకి దిగారు.. ఇక, తాజాగా బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ కేసులో భూ సంబంధిత బాధితులందరికీ న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కుట్రకోణం, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు పెద్దల ప్రమేయానికి సంబంధించిన అంశాలన్నీ ముడిపడి ఉన్న నేపథ్యంలో.. తదుపరి దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు..
Read Also: UPI Payments: దేశంలో నిలిచిపోయిన యూపీఐ సేవలు.. కారణం ఏంటంటే?
కాగా, అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే.. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను సస్పెండ్ చేసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కాదని.. కుట్రలో భాగంగానే ఫైళ్లను తగులబెట్టారని అధికారులు తెలిపారు. ఫైళ్లపై ఏదో కెమికల్ చల్లారు.. కెమికల్ చల్లకుండా ఇంత పెద్ద ఎత్తున ఫైళ్లు త్వరగా దగ్దం కావని అంటున్నారు.. మదనపల్లె ఫైల్స్ ఘటనలో కేవలం 17 నిమిషాల్లో ఫైళ్లన్నీ దగ్దం అయ్యాయని పేర్కొన్నారని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!