Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Chandrababu Naidu Issues Strong Directives At Tdp Core Committee Meeting In Amaravati

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం.. చంద్రబాబు కీలక సూచనలు

Published Date :January 10, 2026 , 9:40 pm
By Sudhakar Ravula
CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం.. చంద్రబాబు కీలక సూచనలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యంగా కొండపై వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం, భోగాపురం ఎయిర్‌పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై నేతలు ప్రస్తావించారు. వైసీపీ నేతలు కుట్రపూరితంగా కొండపై మద్యం బాటిళ్లు పెట్టించి తిరుమల పవిత్రతను భంగం కలిగిస్తున్నారని నేతలు ఆరోపించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ సాయంతో వైసీపీ కుట్రలు బయటపడుతున్నా కూడా ఆ పార్టీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

Read Also: Potatoes: బంగాళాదుంపతో ప్రయోజనాలు..! నాలుగు ప్రధాన అపోహలు..

Also Read

  • AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్‌.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
  • MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
  • AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
  • YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్‌ ఆవేదన..

వైసీపీ చేస్తున్నది కేవలం రాజకీయ దాడి కాదని, హిందూ మతంపై దాడిగా నేతలు అభివర్ణించారు చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయాలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని పలువురు సీనియర్ నేతలు విమర్శించారు. గతంలో దేవాలయాలపై జరిగిన దాడులు, రథం తగులబడిన ఘటన, మూడు సింహాల చోరీ, పరకామణి చోరీ వంటి ఘటనలను నాడు వైసీపీ నేతలు తేలికగా మాట్లాడిన తీరు సమావేశంలో గుర్తు చేశారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ ఉద్యోగి విజయ్ భాస్కర్ రెడ్డి లంచం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆధారాలు లభించాయని నేతలు పేర్కొన్నారు. కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఏ మతాన్ని ఆచరించినా ఇతర మతాలను గౌరవించాల్సిందేనని, భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. నెలలో కనీసం వారం రోజుల పాటు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని సూచించారు.

మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన నీటి సమస్యలపై వ్యాఖ్యలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. గొడవలు వద్దని, రాష్ట్రానికి నీళ్లు కావాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటి కీలక అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే గట్టిగా జవాబు ఇచ్చారని తెలిపారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు, ఫేక్ ప్రచారాలకు పార్టీ శ్రేణులు ధీటుగా స్పందించాలని, ప్రజల్లో నిజాలు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh political news
  • Bhogapuram Airport issue
  • Chandrababu Naidu TDP meeting
  • Pattadar passbooks distribution
  • Rayalaseema Lift Project

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions