Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం
- కోటి వరకూ రుణం ఇస్తాం
- పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్గా ఏపీ మారుతుందన్న చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026కు హాజరైన చంద్రబాబు ప్రసంగించారు. ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పరిశ్రమలకు సన్ రైజ్ స్టేట్గా ఏపీ మారింది. గత పాలకులు పరిశ్రమలను తరిమేశారు. ప్రతి నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 100 పార్కులకు భూమి కేటాయించాం. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. బ్యాంకులు కూడా ఎంఎస్ఎంఈలకు రూ.2.11 లక్షల కోట్లకు పైగా రుణాలు ఇచ్చాయి. బ్యాంకులు కూడా వేగంగా రుణాలు మంజూరు చేసేలా చూస్తున్నాం. ఏపీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రూ.5 వేల కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. కోటి వరకూ రుణం ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.’’ అని అన్నారు.
‘‘వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ తప్పకుండా జరిగి తీరుతుంది. అధికార కార్యక్రమాలకు, ఫంక్షన్లకు, జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలకు అంబేద్కర్ కళావేదిక. 4.43 ఎకరాల్లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్. ఇంతవరకూ ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో, అమరావతిలోనూ లేదు. భారత ఆర్ధిక వ్యవస్ధ వెన్నెముక MSME రంగం. పెద్ద పరిశ్రమగా మార్చే శక్తి MSME లకే ఉంది. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పించే రంగం MSME. ఏపీలో నైపుణ్యం కల వారికి, అన్ని వనరులకు ఎలాంటి కొరత లేదు. MSME సమ్మిట్ 2026 అభివృద్ధికి కీలక మైలురాయి అవుతుంది. 20.77 లక్షల MSME లు రాష్ట్రంలో ఉన్నాయి. తక్కువలో తక్కువ ఒక కోటి MSMEలు ప్రారంభించాలి. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాలలో 175 MSME పార్కులు వస్తాయి. జూలై నాటికి 175 MSME పార్కులు వస్తాయి. ఏపీలో రైతుల సహకారం అమోఘం. మన రాష్ట్రంలో రైతులు పూర్తిగా సహకరిస్తున్నారు. అమరావతికి 33వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. మరో 17 వేల ఎకరాలు కూడా ఇస్తున్నారు. రైతులు, ప్రైవేటు వ్యక్తులు MSME లకు ముందుకు వస్తే ఇన్సెంటివ్లు ఇస్తాం. డ్వాక్రా సంఘాల మీద నాకు నమ్మకం ఉంది. 50 వేల కోట్లు డ్వాక్రా రుణాలు తీసుకుని 99.9 శాతం చెల్లించారు.’’ అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!