Somu Veerraju as MLC Candidate: ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ.. కాసేపట్లో నామినేషన్..
- ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
- సోము వీర్రాజును అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అధిష్టానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju as MLC Candidate: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది.. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే జనసేన నాగబాబును అభ్యర్థిగా ప్రకటించడం.. నామినేషన్ దాఖలు చేయడం జరిగిపోయాయి.. ఇక, ఆదివారం రోజు కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నామినేషన్ వేసేందుకు టీడీపీ అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగయనున్న నేపథ్యంలో.. ఈ రోజు తమ అభ్యర్థి సోము వీర్రాజు అంటూ బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది..
Read Also: Pennsylvania: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..
Also Read
- CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం 'సంజీవని'.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
మొత్తానికి గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన.. సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది బీజేపీ.. ఈ రోజే నామినేషన్లకు చివరి రోజు కావడంతో.. ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీకి 3, జనసేన, బీజేపీ ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.. ఇక, సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చిన సందర్భంలో సరయిన సమయంలో సరైన అవకాశం ఇస్తామని బీజేపీ అగ్రనాయత్వం ఆయనకు హామీ ఇచ్చిందట.. అందులో భాగంగానే సోము వీర్రాజును శాసన మండలికి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. పలువురు ఆశావాహుల మధ్య ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయింపుపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ కేంద్ర అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ కేంద్ర పెద్దల వద్ద తన పట్టు సోము వీర్రాజు నిలుపుకుంటూ మరోసారి ఎమ్మెల్సీ కానున్నారు. రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు నాలుగు దశాబ్దాలుగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఏబీవీపీ, యువమోర్చా… విభాగాల్లో పనిచేసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ పెద్దలు ఏ సమీకరణ ఆధారంగా సోమును ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్లో రవితేజ.. ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్!
-
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
-
Heatwave Workout Tips: వేసవిలో జిమ్ ప్రియులారా జాగ్రత్త..! ఈ తప్పులు చేస్తే ప్రమాదంలో పడ్డట్టే..!
-
KKR vs DC: చివరి లీగ్ మ్యాచ్లో దుమ్మురేపిన ఢిల్లీ.. కేకేఆర్పై భారీ విజయం.!
-
IPL 2026 ప్లేఆఫ్స్ ఖరారు.. రెండవసారి ఛాంపియన్ కాబోయే జట్టు ఏది.?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!