Somu Veerraju as MLC Candidate: ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసిన బీజేపీ.. కాసేపట్లో నామినేషన్..
- ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
- సోము వీర్రాజును అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అధిష్టానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju as MLC Candidate: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎట్టకేలకు బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది.. మొత్తం ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటికే జనసేన నాగబాబును అభ్యర్థిగా ప్రకటించడం.. నామినేషన్ దాఖలు చేయడం జరిగిపోయాయి.. ఇక, ఆదివారం రోజు కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు నామినేషన్ వేసేందుకు టీడీపీ అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగయనున్న నేపథ్యంలో.. ఈ రోజు తమ అభ్యర్థి సోము వీర్రాజు అంటూ బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది..
Read Also: Pennsylvania: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే..
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
మొత్తానికి గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన.. సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది బీజేపీ.. ఈ రోజే నామినేషన్లకు చివరి రోజు కావడంతో.. ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీకి 3, జనసేన, బీజేపీ ఒక్కొక్కటి చొప్పున సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.. ఇక, సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చిన సందర్భంలో సరయిన సమయంలో సరైన అవకాశం ఇస్తామని బీజేపీ అగ్రనాయత్వం ఆయనకు హామీ ఇచ్చిందట.. అందులో భాగంగానే సోము వీర్రాజును శాసన మండలికి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. పలువురు ఆశావాహుల మధ్య ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయింపుపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ కేంద్ర అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ కేంద్ర పెద్దల వద్ద తన పట్టు సోము వీర్రాజు నిలుపుకుంటూ మరోసారి ఎమ్మెల్సీ కానున్నారు. రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు నాలుగు దశాబ్దాలుగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఏబీవీపీ, యువమోర్చా… విభాగాల్లో పనిచేసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేశారు. బీజేపీ పెద్దలు ఏ సమీకరణ ఆధారంగా సోమును ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇక, ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Peddi : పెద్ది నాన్ తెలుగు స్టేట్స్ భారీ నష్టాల దిశగా.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!