Rushikonda buildings: రుషికొండ భవనాలపై కౌన్సిల్లో డిష్యుం డిష్యుం..!
- ఏపీ కౌల్సిల్ లో రుషికొండ అంశంపై రచ్చ..
- ఎండాడ భూములు, రుషికొండ అంశంలో మంత్రి దుర్గేష్ ఫైర్..
- మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు.. మాజీ మంత్రి బొత్స మధ్య వాగ్వాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rushikonda buildings: గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదమే నడిచింది.. ఇప్పటికీ దానిపై కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇక, ఇవాళ కౌల్సిల్ వేదికగా రుషికొండ అంశంపై మరోసారి రచ్చ జరిగింది.. దీనిపై శాసన మండలిలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. ఎండాడ భూములు, రుషికొండ అంశంలో స్ధానికుల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్లలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండ బీచ్ అన్నారు.. అయితే, అన్ని అద్భుతంగా ఉండగానే రిసార్ట్స్ పడగొట్టేశారని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్..
Read Also: Sleeping With Jeans: జీన్స్ వేసుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇక, రుషికొండలో నిర్మాణాల విలాసాలున్నాయన్న మరికొందరు సభ్యులు ఆరోపించారు.. దీంతో.. రుషికొండ నిర్మాణాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మధ్య సీరియస్గా వాగ్వాదం చోటు చేసుకుంది.. చేసిన తప్పు ఒప్పుకోవాలని సూచించారు అచ్చెన్నాయుడు.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎస్ఎఫ్టీ రూ.25వేలకు పైగా నిర్ణయించారని దుయ్యబట్టారు..
Read Also: Baaghi4 : బాబోయ్ టైగర్ ష్రాఫ్.. సీక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు
అయితే, సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు వైసీపీ ఎంఎల్సీ బొత్స సత్యనారాయణ.. ఒకరేమో దమ్ము ఉందా.. రండి చూసుకుందాం.. సిగ్గుందా.. అంటూ మాట్లాడుతున్నారన్న ఆయన.. రిషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలుగా కట్టాం.. దానిని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరి కోసమైనా వాడతాం.. సీఎం, డిప్యూటీ సీఎం అందరూ చూసి వచ్చారు కదా? తత్కాలిక భవనాలకు అమరావతిలో ఫుర్నీచర్ తో కలిపి ఎప్ఎఫ్టీ 14 వేలు ఖర్చు చేశారు.. రిషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలు.. ఆ భవనాలన్ని బాగా కట్టారు అని సీఎం, డిప్యూటీ సీఎంలే చెప్పారు కదా? అని ప్రశ్నించారు.. అందులో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి.. అవి ప్రభుత్వ భవనాలు, జగన్ సొంత భవనాలు కాదు కదా? అంటూ హితవుచెప్పారు బొత్స..
తాజావార్తలు
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
-
France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
-
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!