Rushikonda buildings: రుషికొండ భవనాలపై కౌన్సిల్లో డిష్యుం డిష్యుం..!
- ఏపీ కౌల్సిల్ లో రుషికొండ అంశంపై రచ్చ..
- ఎండాడ భూములు, రుషికొండ అంశంలో మంత్రి దుర్గేష్ ఫైర్..
- మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు.. మాజీ మంత్రి బొత్స మధ్య వాగ్వాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rushikonda buildings: గత ప్రభుత్వ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదమే నడిచింది.. ఇప్పటికీ దానిపై కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇక, ఇవాళ కౌల్సిల్ వేదికగా రుషికొండ అంశంపై మరోసారి రచ్చ జరిగింది.. దీనిపై శాసన మండలిలో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేష్.. ఎండాడ భూములు, రుషికొండ అంశంలో స్ధానికుల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందని విమర్శించారు.. రాష్ట్రంలో ఉన్న అన్ని బీచ్లలో బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండ బీచ్ అన్నారు.. అయితే, అన్ని అద్భుతంగా ఉండగానే రిసార్ట్స్ పడగొట్టేశారని మండిపడ్డారు మంత్రి కందుల దుర్గేష్..
Read Also: Sleeping With Jeans: జీన్స్ వేసుకుని నిద్రిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..
Also Read
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఇక, రుషికొండలో నిర్మాణాల విలాసాలున్నాయన్న మరికొందరు సభ్యులు ఆరోపించారు.. దీంతో.. రుషికొండ నిర్మాణాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మధ్య సీరియస్గా వాగ్వాదం చోటు చేసుకుంది.. చేసిన తప్పు ఒప్పుకోవాలని సూచించారు అచ్చెన్నాయుడు.. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఎస్ఎఫ్టీ రూ.25వేలకు పైగా నిర్ణయించారని దుయ్యబట్టారు..
Read Also: Baaghi4 : బాబోయ్ టైగర్ ష్రాఫ్.. సీక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు
అయితే, సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు వైసీపీ ఎంఎల్సీ బొత్స సత్యనారాయణ.. ఒకరేమో దమ్ము ఉందా.. రండి చూసుకుందాం.. సిగ్గుందా.. అంటూ మాట్లాడుతున్నారన్న ఆయన.. రిషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలుగా కట్టాం.. దానిని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరి కోసమైనా వాడతాం.. సీఎం, డిప్యూటీ సీఎం అందరూ చూసి వచ్చారు కదా? తత్కాలిక భవనాలకు అమరావతిలో ఫుర్నీచర్ తో కలిపి ఎప్ఎఫ్టీ 14 వేలు ఖర్చు చేశారు.. రిషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలు.. ఆ భవనాలన్ని బాగా కట్టారు అని సీఎం, డిప్యూటీ సీఎంలే చెప్పారు కదా? అని ప్రశ్నించారు.. అందులో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి.. అవి ప్రభుత్వ భవనాలు, జగన్ సొంత భవనాలు కాదు కదా? అంటూ హితవుచెప్పారు బొత్స..
తాజావార్తలు
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!