ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అధికారికంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఆగస్టు 9 న రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రకటన చేయనున్నారు. ఆగష్టు 15 నుంచి అధికారికంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో…
ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందిస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ పై శిక్షణ ఇస్తున్నారు.. రాష్ట్ర మంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే అలోచన లో ప్రభుత్వం ఉంది.