Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు నో వర్క్.. నో పే విధానం..! స్పీకర్ సంచలన వ్యాఖ్యలు..
- స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు..
- అసెంబ్లీకి హాజరు కానీ ఎమ్మెల్యేలకు నో వర్క్.. నో పే విధానం ఉండాలి..
- అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు ‘నో వర్క్.. నో పే’ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రసంగం చేశారు.
Read Also: Mankatha: అజిత్ ‘గ్యాంబ్లర్’ రీ-రిలీజ్ బుకింగ్స్ ఊచకోత!
Also Read
ఎమ్మెల్యేలు ప్రజల ప్రతినిధులని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకుని పంపిన ప్రతినిధులు సభకు రాకుండా జీతాలు పొందడం సరికాదన్నారు. శాసనసభ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారానే ప్రజల సమస్యలు చర్చకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై లోక్సభ స్పీకర్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు ఈ విషయాన్ని గంభీరంగా పరిగణనలోకి తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు కోరారు. శాసనసభ వ్యవస్థను మరింత బాధ్యతాయుతంగా మార్చేందుకు ఇలాంటి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరిగా ఉండేలా ‘నో వర్క్.. నో పే’ విధానం అమలైతే, శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని, ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. కాగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలోనూ ఈ తరహా కామెంట్లు చేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!