Nara Lokesh: కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు.. కుమారుడితో సెల్ఫీ వైరల్..!
- మహా కుంభమేళాలో ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతులు..
- కుంబమేళాలో లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు..
- కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: కుంభమేళా పోటెత్తుతోంది.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో మహాకుంభమేళ ఘనంగా సాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాలకు చెందిన భక్తులు కూడా భారీగా కుంభమేళాకు తరలివస్తున్నారు. దీంతో.. ప్రతీ రోజూ కోట్లాది భక్తులు త్రివేణి సంగంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్షా సహా.. పలువురు ప్రముఖులు, సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా చెబుతూ పోతే లిస్ట్ పెద్దదే.. అంతేకాదు.. ఎప్పుడూ లేని విధంగా రోజుకో రికార్డు తరహాలో కుంభమేళాకు తరలివస్తున్నారు భక్తులు.. ఇక, ఈ రోజు మహా కుంభమేళాలో ఏపీ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు.. ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీని మంత్రి లోకేష్ షేర్ చేయడంతో వైరల్గా మారిపోయింది..
Read Also: Manchu Manoj: నారా లోకేష్ ను కలిసిన మంచు మనోజ్
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి.. గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం. ఇక, ఈ సందర్భంగా లోకేష్ దంపతులు తమ కుమారుడు దేవాన్ష్ తో కలిసి దిగిన సెల్ఫీ వైరల్గా మారిపోయింది.. మరోవైపు.. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు.


Truly blessed! #MahaKumbhMela2025#MahaKumbh#Prayagraj pic.twitter.com/K4Xn6r6c0H
— Lokesh Nara (@naralokesh) February 17, 2025
The experience of #MahaKumbhMela2025 is truly one of a lifetime! As we took the holiest of holy dips today at Prayagraj, I could feel the electrifying energy emanating from the collective beliefs of millions gathered on this divine land. Feeling blessed! pic.twitter.com/TkE9YuVH5z
— Brahmani Nara (@brahmaninara) February 17, 2025
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!