AP Government: గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు..
- శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
- బార్ల లైనెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ల ఛార్జీలు తగ్గింపు..
- త్రి స్టార్ సహా ఆ పై స్థాయి హోటళ్లలో lనిర్వహించే బార్లకు వర్తింపు..
- 2025 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: స్టార్ హోటళ్లలో నిర్వహించే బార్ల లైనెన్స్ ఫీజులు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ల ఛార్జీలను తగ్గిస్తూ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో త్రి స్టార్ సహా ఆ పై స్థాయి హోటళ్లలో బార్ల లైసెన్సు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.66 లక్షల నుంచి రూ.25 లక్షలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.. పర్యాటకంతో పాటు ఆతిథ్యరంగానికి ఊతమిచ్చేలా బార్ల రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజులను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5 లక్షల మేర, నాన్ రిఫండబుల్ ఛార్జీ రూ. 20 లక్షల మేర నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
Read Also: Iran: ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు..500 మందికి గాయాలు..
Also Read
- AP Weather Updates : బయట అడుగు పెడితే భగ్గుమంటోంది.. ఏపీలో రికార్డు వేడి.!
- Chandrababu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ తయారవుతోంది
- Chandrababu: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమం చేపడతాం.. భారీగా నిధులిస్తామన్న చంద్రబాబు
- YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
దేశంలోనే ఎక్కడా లేనంత ఎక్కువగా ఉన్న ఈ ఫీజులు, ఛార్జీలను తగ్గించాలంటూ ఏపీ హోటల్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకుంది.. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా లైసెన్స్ ఫీజులను సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.. బార్ లైసెన్సు ఫీజు, నాన్ రిఫండబుల్ ఛార్జీని తగ్గించాల్సిందిగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఆతిథ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెరిగేందుకు, రిసార్టులు, హోటళ్లకు ఈ నిర్ణయం ప్రోత్సాహం కల్పిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.. స్థానిక జనాభాతో సంబంధం లేకుండానే స్టార్ హోటళ్లు ఉన్నచోట ఈ లైసెన్సు ఫీజు, ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది.. 2025 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?