CM Chandrababu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టాలంటే కేంద్ర నిధులు కీలకం.. ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం
- టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చ
- భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. జగన్ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారనే విషయాన్ని ఎంపీలకు సీఎం చంద్రబాబు వివరించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే కేంద్ర నిధులను తేవడం చాలా కీలకమని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ చెప్పేవన్నీ తప్పుడు విషయాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని ఎంపీలకు సూచించారు. అనవసర విషయాలపై మన ఫోకస్ పెట్టేలా రాజకీయం చేసే జగన్ ఉచ్చులో పడకూడదన్నారు.
Read Also: Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు..
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”జగన్ పోతూ పోతూ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయాడు. ఒకట్రెండు కార్పొరేషన్లకే నిధులన్నీ మళ్లించేశాడు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేశారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాష్ట్రాభివృద్ధిని సవాల్గా తీసుకుని నిర్మాణాత్మకంగా పని చేద్దాం. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్కు లేదు. గంజాయి, మాదకద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు. వినుకొండ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలి. వైసీపీ అబద్ధపు విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడద్దాం.”అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..