CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ..
- ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీ..
- ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ..
- సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం..
- రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీకానున్న ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Delhi Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బిజీ బిజీగా గడుపుతున్నారు.. నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు.. ఇక, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
ఇక, తొలిరోజు (నిన్న రాత్రి) కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, “కేంద్ర జల సంఘం”, జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఉన్నతాధికారులు గంటకు పైగా సమావేశం అయ్యారు. సత్వరమే పోలవరం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చలు జరిగాయి.. కొత్తగా పెరిగిన నిర్మాణ పనులను ప్రస్తుతం నిర్మాణ పనులను చేస్తున్న నిర్మాణ సంస్థకే ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు..
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. కరవు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే శక్తి పోలవరం ప్రాజెక్టుకు ఉంది. 2019-2024 జగన్ పాలనలో 20 నుంచి 30 శాతం పోలవరం వెనక్కి పోయిందని విమర్శించారు.. కేంద్ర జల సంఘం, మంత్రిత్వశాఖ అధికారులతో కీలక సమావేశం గంటకు పైగా సాగింది. “డయా ఫ్రమ్” వాల్ ను కొత్తగా నిర్మించాలని నిర్ణయం జరిగింది. 2022 టెండర్ లో 3,090 కోట్ల రూపాయల మేరకు పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థకే కొత్త పనులు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. అప్పటి ధరలకే నిర్మాణ పనులు చేసేందుకు అంగీకరించడంతో, కొత్త పనులు కూడా ఆ సంస్థ కే ఇవ్వాలనే నిర్ణయించామని.. పోలవరం నిర్మాణం సత్వరమే, నిర్దిష్టమైన సమయం మేరకు పనులు కొనసాగాలని పేర్కొన్నారు. 73 వేల చదరపు మీటర్ల మేరకు నిర్మాణ పనులు పెరిగాయి. కుడి కాలువ ద్వారా, కృష్ణా నది కి గోదావరి జలాలు అందేలా చేయాలన్నదే లక్ష్యంగా తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!