AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్..
- ఆపరేషన్ సిందూర్ను అభినందిస్తూ కేబినెట్ తీర్మానం..
- ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు..
- ఏపీ రాజధాని అమరావతి అని కేబినెట్ తీర్మానం..
- కేబినెట్ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనున్న ఏపీ ప్రభుత్వం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆపరేషన్ సిందూర్ను అభినందిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది.. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది కేబినెట్.. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.. ఇక, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చసాగగా.. తీరప్రాంత భద్రత, రక్షణరంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు.. మరోవైపు, ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.. అంటే, ఏపీ రాజధాని అమరావతి అని కేబినెట్ తీర్మానం తీసింది.. కేబినెట్ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనుంది ఏపీ ప్రభుత్వం ..
Read Also: Rohit Sharma: అంతా చెత్త.. భారత్ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ ఏపీ టూర్ లో ప్రధాన వేదిక పై సీటింగ్ ఏర్పాటు పై మంత్రి వర్గంలో చర్చకు వచ్చిందట.. కేంద్ర మంత్రులను ఒక వైపు.. ఏపీ మంత్రులను మరోపక్క కూర్చునేల ప్రోటోకాల్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్న సీఎం చంద్రబాబు. తన పక్కన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్నారు.. మరోసారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు..
Read Also: PBKS vs MI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధర్మశాల టు అహ్మదాబాద్!
ఇక, జలవనరుల శాఖ లో కంపెనీల చట్టం కింద జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.. చెరువుల్లో తవ్విన మట్టిని ఉచితంగా పొలాలకు తరలించేందుకు రైతులకు అనుమతి ఇస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలపగా.. టూరిజం ప్రాజెక్టులలోనూ ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహాలు అందించేదుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!