AP Cabinet: వారికి గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..
- కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్..
- వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సాయం రూ.20 వేలకు పెంపు..
- మత్స్యకారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- ఈ నెల 26న మత్స్యకారులకు రూ.20 వేల చొప్పు సాయాన్నిఅందించనున్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది.. సంక్షేమ పథకాల అమలుపై కూడా కేబినెట్లో చర్చ సాగింది.. ఇక, కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. సామాజిక న్యాయం కోసం టీడీపీ పని చేసింది.. ఇప్పుడు ఎన్డీయే కూడా కట్టుబడి ఉందన్న ఆయన.. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది.. జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ జరిగింది.. ఆర్డినెన్స్ రెండురోజుల్లో వస్తుంది.. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్నారు.. ఇక, ఎన్డీఏ కూటమి వేట నిషేధ సమయంలో మత్స్య కారుల సాయాన్ని పది వేల నుంచి 20 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ మత్స్యకారులకు శుభవార్త చెప్పారు మంత్రి నిమ్మల.. ఈ నెల 26వ తేదీన మత్స్యకారులకు రూ.20 వేల చొప్పు సాయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అందిస్తారని తెలిపారు..
Read Also: Kotha Prabhakar Reddy : కాంగ్రెస్ను మేము కూల్చబోము.. కానీ మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం
Also Read
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
- AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ఐటీ సెక్టార్ కి భూములు ఇచ్చే విషయంలో విధానాలు సరళంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం.. రాజధాని పనులు త్వరితగతిన ప్రారంభించేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రికి భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో వైసీపీ కులాలు.. మతాలు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని మండిపడ్డారు.. మాజీ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో మతాల మధ్య చిచ్చు పెట్టె కార్యక్రమం జరుగుతోంది. వక్ఫ్ బిల్ పేరుతో ముస్లిం.. పాస్టర్ పేరుతో క్రైస్తవులు.. గో మరణాల పేరుతో హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాజ్యసభ లో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి.. బయటకు వచ్చి డబుల్ స్టాండ్ రాజకీయం చేశారని దుయ్యబట్టారు. డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తి టీటీడీపై మాట్లాడతారు… భూమన చరిత్ర ఎవరికి తెలియదు.. ఆయన నాస్తికుడు.. ఐదేళ్ల వైసీపీ పాలనలో గోవులు చనిపోవడంపై నిన్న టీటీడీ ఈవో వివరించారిన తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!