AP Cabinet: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కు అభినందనలు తెలిపిన కేబినెట్..
- ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది..
- కేబినెట్ సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎంకు మంత్రుల అభినందనలు..
- పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్ సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్కు మంత్రులందరం అభినందనలు తెలిపామని వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించిన పార్థసారథి.. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు రూ.5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో రూ. 8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. ఖైదీలు బయటకు వచ్చి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే క్షమాభిక్ష వెనక్కు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
Read Also: CM Chandrababu: మంత్రులతో కీలక అంశాలపై చర్చ.. దూకుడు పెంచాలని సీఎం ఆదేశాలు
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
ఇక, 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించే ప్రతిపాదన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా గా మారుస్తూ తీసుకువచ్చిన జీవోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. పలు సంస్థలకు భూకేటాయింపులు, హోమ్ శాఖ కు భూ కేటాయింపులు రాయితీల కల్పన పై మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు పార్థసారథి.. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నింబధనల సవరణలకు ఆమోదం లభించింది.. ఏపీ షాప్స్ ఆండ్ ఎస్టాబిలిష్ మెంట్ బిల్లు 2025 చట్టంలో నింబధనల సవరణలకు ఆమోదముద్ర పడిందన్నారు.. విశాఖపట్నంలో యాత్రి నివాస్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సంబంధించి ర్యాటి ఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. క్వామ్ టమ్ వ్యాలీకి సంబంధించి స్కూళ్ళు దగ్గర నుంచి యూనివర్సిటీల వరకు ఇన్వాల్వ్ అయ్యేలా చూడడంతో పాటు 50 ఎకరాల కేటాయిస్తు నిర్మయం తీసుకున్నామని వెల్లడించారు.
Read Also: Bilawal Bhutto: భారత్లో ముస్లింలను రాక్షసులుగా చూపిస్తున్నారు..
యోగాంధ్ర కార్యక్రమం కోసం మాస్ ర్యాలీలు చేయాలి.. అందరూ పాల్గొనేలా చర్యలకు సంబంధించి కేబినెట్లో చర్చించాం.. తెలుగు సినిమా సెలెబ్రిటీలు కూడా యోగలో పాల్గొనేందుకు పర్యాటక శాఖా మంత్రి చర్యలు తీసుకుంటారని తెలిపారు మంత్రి పార్థసారథి.. మరోవైపు, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి ముగ్గురుమంత్రులు డుమ్మా కొట్టారు.. దేవాదాయశాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.. రవాణా శాఖా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి.. పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు.. దీనిపై ముందుగానే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది..
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!