AP Assembly Budget Session: మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- మార్చి 19వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- మొత్తంగా 15 వర్కింగ్ డేస్ లో సమావేశాలు..
- అవసరం అయితే మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయం..
- వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Budget Session: మార్చి 19వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.. మొత్తంగా 15 వర్కింగ్ డేస్ లో సమావేశాలు జరగనున్నాయి.. అవసరం అయితే మరో రెండు రోజులు పొడిగించాలని బీఏసీలో నేతలు అభిప్రాయపడ్డారు.. అయితే, వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభం అయ్యాయి.. ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారన్నారు గవర్నర్.. అబ్దుల్ నజీర్.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు…8 నెలల పాలన…భవిష్యత్తు లక్ష్యాలు వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని గవర్నర్ తన ప్రసంగం లో వివరించారు. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని.. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారన్నారు గవర్నర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం అన్నారు..
Read Also: YS Avinash Reddy: పులివెందుల ఉప ఎన్నిక కాదు.. మంగళగిరి, పిఠాపురం, కుప్పం సిద్ధమా..?
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని… ప్రతినెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం అన్నారు గవర్నర్. పెన్షన్లు రూ.4వేలకు పెంచామని…పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం.. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు.. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం అని తెలిపారు.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం…అని.. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశాం. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష తో ప్రభుత్వం ఉందన్నారు.. ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తున్నాం అని.. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు… సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం…అన్నారు గవర్నర్ నజీర్… ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం. జరిగింది.. సభను వచ్చే నెల 19 వరకు జరపాలని బీఏసీ లో నిర్ణయించారు.. అవసరం అయితే మరో రెండు రోజులు పాటు రిజర్వ్ లో ఉంచారు….15 వర్కింగ్ డేస్ సభను జరపాలని డిసైడ్. అయ్యారు….
తాజావార్తలు
-
హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
-
Kantamaneni Ravi Shankar: పంచభూతాలపై టాలీవుడ్ లో కొత్త సినిమా
-
CM Vijay: సీఎం విజయ్కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!