AP Assembly Budget Session: మార్చి 19 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
- మార్చి 19వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- మొత్తంగా 15 వర్కింగ్ డేస్ లో సమావేశాలు..
- అవసరం అయితే మరో రెండు రోజులు పొడిగించాలని నిర్ణయం..
- వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ..
AP Assembly Budget Session: మార్చి 19వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.. మొత్తంగా 15 వర్కింగ్ డేస్ లో సమావేశాలు జరగనున్నాయి.. అవసరం అయితే మరో రెండు రోజులు పొడిగించాలని బీఏసీలో నేతలు అభిప్రాయపడ్డారు.. అయితే, వారానికి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం తో ప్రారంభం అయ్యాయి.. ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారన్నారు గవర్నర్.. అబ్దుల్ నజీర్.. ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు…8 నెలల పాలన…భవిష్యత్తు లక్ష్యాలు వివరిస్తూ గవర్నర్ ప్రసంగం సాగింది. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని గవర్నర్ తన ప్రసంగం లో వివరించారు. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని.. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారన్నారు గవర్నర్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం అన్నారు..
Read Also: YS Avinash Reddy: పులివెందుల ఉప ఎన్నిక కాదు.. మంగళగిరి, పిఠాపురం, కుప్పం సిద్ధమా..?
Also Read
ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని… ప్రతినెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం అన్నారు గవర్నర్. పెన్షన్లు రూ.4వేలకు పెంచామని…పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం.. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు.. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం అని తెలిపారు.. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం…అని.. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశాం. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష తో ప్రభుత్వం ఉందన్నారు.. ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తున్నాం అని.. ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు… సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం…అన్నారు గవర్నర్ నజీర్… ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం. జరిగింది.. సభను వచ్చే నెల 19 వరకు జరపాలని బీఏసీ లో నిర్ణయించారు.. అవసరం అయితే మరో రెండు రోజులు పాటు రిజర్వ్ లో ఉంచారు….15 వర్కింగ్ డేస్ సభను జరపాలని డిసైడ్. అయ్యారు….
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!