Ambati Rambabu: అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కి ఏడు బిల్డింగ్లైనా పూర్తి చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: నవ్యాంధ్ర రాజధాని అంశంపై ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అమరావతి ప్రాజెక్ట్పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, 2029 నాటికీ రాజధాని పూర్తవుతుందా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉంచుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం సాధ్యం కాదని ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. 2029 నాటికీ కనీసం ఏడు భవనాలైనా పూర్తి చేస్తారో లేదో అనుమానం ఉందని అన్నారు.
Read Also: Iron Rich Foods: బాబోయ్ బ్లడ్ తగ్గిందా?.. ఇవి తింటే సరిపడా రక్తం పడుతుంది!
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
మావిగన్ అనే కొత్త అభివృద్ధి ఆలోచనను కూడా అంబటి ప్రస్తావించారు. ఇది జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ప్రతిపాదనగా పేర్కొంటూ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రమాదంతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కోసం సుమారు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ మావిగన్ ప్రాజెక్ట్ను కేవలం 20 వేల కోట్లతో అభివృద్ధి చేయవచ్చని అంబటి పేర్కొన్నారు. మూడు జిల్లాలతో కూడిన ఈ కారిడార్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వృద్ధి కేంద్రంగా మారుతుందని చెప్పారు.
అలాగే అమరావతి రైతుల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు అంబటి. తమకు హామీ ఇచ్చిన ప్లాట్లు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సీఆర్డీఏ అధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టత లేకపోవడం వల్లే ఈ అయోమయం నెలకొంది అని అంబటి ఆరోపించారు. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారడం సహజమేనని, అవసరమైతే కొత్త తీర్మానాలు ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు. మొత్తంగా, అమరావతి ప్రాజెక్ట్ భవిష్యత్తుపై మరోసారి రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. 2029 నాటికి రాజధాని పూర్తి అవుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!