Ambati Rambabu: మహానాడు తుస్సుమంది.. అంబటి సెటైర్లు
- టీడీపీ మహానాడు తుస్సుమంది..
- చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతాభావం కనిపించింది..
- ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు తుస్సుమంది అంటూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతాభావం కనిపించింది.. కడప మహానాడు తుస్సుమంది.. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాల సమయంలో కూడా జగన్ ను తిట్టించటం కింద నవ్వుకోవటం.. మేం మీ మీద ఇలా మీ మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు.. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు.. మీ గృహ ప్రవేశానికి మీ చెల్లెళ్లను పిలిచారా..? మహానాడులో గావు కేకలతో మాట్లాడి సక్సెస్ అయ్యింది అని చెప్పుకుంటున్నారు.. లోకేష్ గారికి ముందుంది ముసళ్ల పండగ.. ఆయన అనుభవం లేకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.. మామీద కేసులు పెడుతున్నారు.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గుర్తు పెట్టుకోండి అని హెచ్చరించారు..
Read Also: MLA Raja Singh : బక్రీద్ పండుగ ఎలా జరుపుకుంటారో మాకు అనవసరం.. కానీ..
Also Read
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Chandrababu: మహానాడుపై చంద్రబాబు సంచలన నిర్ణయం
- Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
- Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
కూటమి ప్రభుత్వం హామీలు అమలు కాకపోవడంతో వెన్నుపోటు దినంగా జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో నిరసన తెలపాలని పిలుపునివ్వడంతో నేడు మంగళగిరి వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షతన అన్ని నియోజకవర్గాల ఇంఛార్జ్లతో వైసీపీ కార్యకర్తల సమక్షంలో సమావేశం నిర్వహించారు.. జూన్ 4న జరగబోయే వెన్నుపోటు దినంను జయప్రదం చేయాలని మాజీ మంత్రి అంబటి కోరారు.. ఇక, మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మంత్రి లోకేష్ ఓ పిల్ల సైకోల ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు.. రాష్ట్రంలో సీఐ దగ్గర నుంచి డీఎస్పీ వరకు ఎవరి పోస్ట్ మారాలన్న సూట్ కేసులు అందించాల్సిందే అని కామెంట్ చేశారు.. రాజధాని పేరుతో వేలకోట్ల రూపాయలు కొడుకు ద్వారా అక్రమ సంపాదనను సంపాదిస్తున్నారు చంద్రబాబు… చంద్రబాబు స్టీరింగ్ లోకేష్ చేతిలో పెట్టారు.. అది ఎప్పుడో గుద్దుతాడు జాగ్రత్త అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు అడగ్గానే పవన్ కల్యాణ్ తిక్కలోడిలాగా ఎక్కడపడితే అక్కడ సంతకాలు పెట్టేస్తున్నాడు.. చంద్రబాబు పథకాలను బీజేపీ నమ్మలేదు కాబట్టే సంతకం పెట్టకపోగా.. కనీసం పట్టుకునే సాహసం కూడా చేయలేదు.. లోకేష్ తెలివి తక్కువ ఇన్ మెచ్యూర్ పొలిటిషన్గా ప్రవర్తిస్తున్నాడు, చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోతే పారిపోయి కుప్పంలో పోటీ చేశాడు మంగళగిరిలో ఓడిపోయి ఇక్కడే గెలిచాను అని మీ నాన్నకు చెప్పు మళ్లీ ఇక్కడే ఓడిపోతావు అంటూ అంబటి రాంబాబు లోకేష్ను విమర్శించారు..
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..