Amaravati: స్పీడందుకున్న రాజధాని అమరావతి పనులు..
- రాజధాని అమరావతిలో స్పీడందుకున్న పునఃనిర్మాణ పనులు..
- రాజధాని పనులకి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ..
- సీఆర్డీఏ అథారిటీతో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వరుస సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పునఃనిర్మాణ పనులు స్పీడందుకున్నాయి.. రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బాంక్ నుంచి నిధులు విడుదల అయ్యాయి.. దీంతో, పనుల్లో వేగం పెరిగింది.. 2019లో జరిగిన ఎన్నికలకు ముందే రాజధాని పనులు ఆగిపోయాయి.. అప్పట్లో ఏపీ సచివాలయ శాశ్వత భవనం పునాది, హైకోర్టు ఏర్పాటు కోసం పునాది నిర్మించారు. కానీ, ఆ పునాది ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోయాయి.. వాటిని తోడే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. కాగా, సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.. 40 నుంచి 50 అంతస్థులు ఉండే విధంగా ఏర్పాటు జరిగింది.. సరిగ్గా 2018 డిసెంబర్ 27న నిర్మాణ పనులు ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు..
Read Also: Sonia Gandhi: గాంధీ వారసత్వం ముప్పులో ఉంది.. బీజేపీ,ఆర్ఎస్ఎస్పై విమర్శలు..
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
బాగా ఎత్తైన రెండు టవర్లు ఏర్పాటు చేయాలని అప్పుడు పనులు ప్రారంభించారు… తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని పనులు ఆగిపోయాయి.. మళ్లీ ఇప్పుడు సరిగ్గా ఇదే టైంకు పనులు ప్రారంభం అవుతున్నాయి. శాశ్వత నిర్మాణాల కోసం వేసిన పునాదిలో ప్రస్తుతం నీళ్లు చేరాయి.. ప్రభుత్వం దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించింది… ఐఐటీ హైదరాబాద్ బృందం నీటి లోపల ఉన్న పునాదులు పరిశీలించింది. పునాదులకు ఎలాంటి ఢోకా లేదని పనులు చేసుకోవచ్చని ఈ బృందం సూచించింది. దీంతో, ట్రాక్టర్ల ఇంజన్లకి భారీ మోటార్లు అమర్చి నీటిని తోడే కార్యక్రమం జరుగుతోంది.
Read Also: YS Jagan Praja Darbar in Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. పోటెత్తిన జనం
రాజధాని పనులకి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతోంది.. సీఆర్డీఏ అథారిటీ కూడా తరచు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుతోంది.. రాజధాని పనులకు ఆమోదం కూడా తెలుపుతోంది సీఆర్డీఏ అథారిటీ.. బహుశా వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉంది. అమరావతితో పాటు 26 జిల్లాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు మంత్రి నారాయణ.. రాజధాని పనులుపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టింది.. టెండర్ల ప్రక్రియ పూర్తయితే మరింత వేగంగా పనులు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
-
Vishal: నేను బ్యాక్బెంచర్నే.. మా బ్యాచ్లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ మంత్రి..
-
Big Offer: శాంసంగ్ నుంచి బంపర్ ఆఫర్.. ఆ ఫోన్పై ఏకంగా రూ.37 వేలు డిస్కౌంట్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!