Amaravati: స్పీడందుకున్న రాజధాని అమరావతి పనులు..
- రాజధాని అమరావతిలో స్పీడందుకున్న పునఃనిర్మాణ పనులు..
- రాజధాని పనులకి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ..
- సీఆర్డీఏ అథారిటీతో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వరుస సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పునఃనిర్మాణ పనులు స్పీడందుకున్నాయి.. రాజధానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బాంక్ నుంచి నిధులు విడుదల అయ్యాయి.. దీంతో, పనుల్లో వేగం పెరిగింది.. 2019లో జరిగిన ఎన్నికలకు ముందే రాజధాని పనులు ఆగిపోయాయి.. అప్పట్లో ఏపీ సచివాలయ శాశ్వత భవనం పునాది, హైకోర్టు ఏర్పాటు కోసం పునాది నిర్మించారు. కానీ, ఆ పునాది ప్రాంతాల్లో వర్షం నీళ్లు నిలిచిపోయాయి.. వాటిని తోడే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. కాగా, సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది.. 40 నుంచి 50 అంతస్థులు ఉండే విధంగా ఏర్పాటు జరిగింది.. సరిగ్గా 2018 డిసెంబర్ 27న నిర్మాణ పనులు ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు..
Read Also: Sonia Gandhi: గాంధీ వారసత్వం ముప్పులో ఉంది.. బీజేపీ,ఆర్ఎస్ఎస్పై విమర్శలు..
Also Read
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
బాగా ఎత్తైన రెండు టవర్లు ఏర్పాటు చేయాలని అప్పుడు పనులు ప్రారంభించారు… తర్వాత జరిగిన పరిణామాలతో రాజధాని పనులు ఆగిపోయాయి.. మళ్లీ ఇప్పుడు సరిగ్గా ఇదే టైంకు పనులు ప్రారంభం అవుతున్నాయి. శాశ్వత నిర్మాణాల కోసం వేసిన పునాదిలో ప్రస్తుతం నీళ్లు చేరాయి.. ప్రభుత్వం దీనిపై నిపుణులతో అధ్యయనం చేయించింది… ఐఐటీ హైదరాబాద్ బృందం నీటి లోపల ఉన్న పునాదులు పరిశీలించింది. పునాదులకు ఎలాంటి ఢోకా లేదని పనులు చేసుకోవచ్చని ఈ బృందం సూచించింది. దీంతో, ట్రాక్టర్ల ఇంజన్లకి భారీ మోటార్లు అమర్చి నీటిని తోడే కార్యక్రమం జరుగుతోంది.
Read Also: YS Jagan Praja Darbar in Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. పోటెత్తిన జనం
రాజధాని పనులకి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ జరుగుతోంది.. సీఆర్డీఏ అథారిటీ కూడా తరచు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు జరుపుతోంది.. రాజధాని పనులకు ఆమోదం కూడా తెలుపుతోంది సీఆర్డీఏ అథారిటీ.. బహుశా వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉంది. అమరావతితో పాటు 26 జిల్లాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు మంత్రి నారాయణ.. రాజధాని పనులుపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టింది.. టెండర్ల ప్రక్రియ పూర్తయితే మరింత వేగంగా పనులు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
-
Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
-
Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
-
Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!