Maoists killed: మూడు రోజులుగా కూంబింగ్.. ఏడుగురు మావోయిస్టులు మృతి!
- అల్లూరి జిల్లాలో మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతుంది..
- కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు..
- ఇవాళ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది..
- ఎన్కౌంటర్లో టెక్ శంకర్ కూడా మృతి చెందారు..
- ఎన్కౌంటర్ స్పాట్లో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం: ఎస్పీ అమిత్ బర్దర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists killed: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి మండలం జియ్యమ్మ వలస దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ పై ఎస్పీ అమిత్ బర్డర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం 5:30 సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది.. ఎక్సేంజ్ ఆఫ్ ఫైర్ అనంతరం ఏడు మృతదేహాలు దొరికాయి.. ఇవాళ జరిగిన ఫైర్ లో మావోయిస్టు కీలక సభ్యుడు జోగారావు బాడీ లభ్యమైంది.. రెండు ఏకే 47 వెపన్స్ తో పాటు ఇతర ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి.. గత మూడు రోజుల నుంచి అల్లూరి జిల్లా ఏజెన్సీలో ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఇప్పటి వరకు జరిగిన రెండు ఎన్ కౌంటర్లల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు అని ఎస్పీ బర్దర్ వెల్లడించారు.
Read Also: Visakhapatnam: టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం..
Also Read
ఇక, సెంట్రల్ టీమ్స్ కూడా ఆపరేషన్ లో పాల్గొన్నాయని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ఏపీ టీమ్స్- సెంట్రల్ మిలిటరీ ఫోర్స్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.. టెక్ శంకర్ అలియాస్ జోగరావుపై రూ. 20 లక్షలు రివర్డ్ ఉంది.. ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ లో కూడా ఇంతే స్థాయిలో రివార్డు ఉందన్నారు. హిడ్మాపై కోటి 80 లక్షల రూపాయల రివార్డ్ ఉంది.. గత మూడు రోజులు భారీగా కూంబింగ్ చేశాం.. పోలీసులకు ఎక్కడ డ్యామేజ్ జరగలేదు.. ఛత్తీస్ గఢ్ లో భారీగా మావోయిస్టులను రిక్రూట్మెంట్ కూడా చేసినట్టు తెలుస్తుంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో కేవలం ఒకరిద్దరు మినహా మావోయిస్టు మనుగడ పెద్దగా లేదని భావిస్తున్నాం.. మారేడుమిల్లి షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్టు తెలిసింది.. హిడ్మా 28, 29 దాడులు చేశారు.. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతుంది. కొంత మందికి సంబంధించిన బంధువులు వచ్చారని అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
-
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!