Maredumilli: మారేడుమిల్లి వెళ్లే టూరిస్టులకి పోలీసుల వార్నింగ్.. ఎందుకో తెలుసా..?
- మారేడుమిల్లి వెళ్లే పర్యటకులకు పోలీసుల వార్నింగ్..
- అటవీలోకి వెళ్లొద్దని మారేడుమిల్లి పోలీసుల హెచ్చరిక..
- అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు ఉన్నట్లు గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maredumilli: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లోద్దని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో జరిగిన ఎన్ కౌంటర్లు నేపథ్యంలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో మావోయిస్టులు ఇంతకు ముందే మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు అమర్చినట్లు గుర్తించాయి. భద్రతా దళాలను హత మార్చేందుకు వీటిని అమర్చారని కూంబింగ్ లో పోలీసులు కనుగొన్నారు. దీంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రత దళాలు ఈ మందు పాత్రలను వెలికి తీసే పనులు ప్రారంభించారు. మందు పాత్రలను వెలికి తీసే వరకు అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు, పర్యాటకులు వెళ్లొద్దని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Read Also: ఆయుర్వేదంలో ఆపరేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వ్యతిరేకిస్తున్న అల్లోపతి వైద్యులు
Also Read
అయితే, మారేడుమిల్లి అటవీ ప్రాంత పరిధిలో గత నెల 18, 19 తేదీల్లో మావోయిస్టులు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత.. హిడ్మాతో పాటు మొత్తం 13 మంది మృతి చెందారు. అలాగే, ఈ నెల 25వ తేదీన ఒడిశాలోని కంధమాల్ జిల్లా అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఉయికేతో సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే భద్రత దళాలు కొన్ని ల్యాండ్ మైన్స్, ప్రెజర్ మైన్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో భాగంగా మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాలను జల్లెడ పట్టి, మందు పాత్రలను వెలికి తీసే చర్యలను పోలీసులు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!