Selfie Accident: సెల్ఫీ సరదా.. మూడు నిండు ప్రాణాలు బలి.!
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన
- సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు యువతులు మృతి
- అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామం సమీప జలపాతం వద్ద ప్రమాదం
- నలుగురు యువతులు జలపాతానికి వెళ్లిన సమయంలో ప్రమాదం
- జారి నీటిలో పడిపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి..
Selfie Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ ఘటన అనంతగిరి మండలం మల్లంగుమి గ్రామ సమీపంలోని జలపాతం వద్ద జరిగింది. అందిన వివరాల ప్రకారం గ్రామ సమీపంలో ఉన్న జలపాతానికి వెళ్లిన నలుగురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో వారు అక్కడ అదుపు తప్పి జారి నీటిలో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు యువతులు మృతి చెందగా, మరో యువతిని స్థానికులు సాహసంగా రక్షించారు.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
మృతులను బూర్జ పంచాయతీ పరిధిలోని జంబువలస గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ జలపాతం అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల సహాయక చర్యలు కాస్త ఆలస్యంగా జరిగాయని తెలుస్తోంది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
ICC: టెస్ట్ క్రికెట్కు కొత్త ఊపిరి.. WTC ఫార్మాట్ మార్పులకు రంగం సిద్ధం..!
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!