YSRCP Plenary 2022: ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు.. వేదిక రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న వైసీపీ పండుగ ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్ల గురించి మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. వేదికపై 280 మందికి సీటింగ్ ఉంటుందనీ, మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలు మొదటి వరుసలో ఉంటారు.నాలుగు క్యాటగిరీల్లో పాసులు జారీ చేస్తున్నాం. డయాస్ పాస్, వీవీఐపీ పాస్, వీఐపీ పాస్, డిగ్నటరీస్ పాస్. వేదికపై ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్పీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారన్నారు.
వేదిక కింద మొదటి వరుసలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్పీలు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ఆసీనులవుతారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. మొదటి రోజు లక్ష మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నాం. రెండో రోజు మూడు నుంచి నాలుగు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ప్లీనరీ ఏర్పాట్ల పై కసరత్తు కొనసాగుతోందన్నారు. నేతల వరుస సమావేశాలతో వాతావరణం వేడెక్కింది. ప్లీనరీకి సంబంధించి ఏం చేయాలనేదానిపై సమావేశం అయ్యారు మంత్రులు పెద్దిరెడ్డి, మేరుగ నాగార్జున, నారాయణ స్వామి, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, ధర్మాన ప్రసాదరావు, కార్మూరి, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు. ప్లీనరీ ప్రాంగణాన్ని, గ్రౌండ్ ను పరిశీలించారు మంత్రులు.
Also Read
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
రాబోయే ఏడాది ప్రభుత్వ పరంగా, అటు పార్టీ పరంగా ఏం చేయాలనదానిపై కసరత్తు ముమ్మరం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలుచేశామని, ఇవ్వని హామీలు కూడా అమలుచేస్తున్నామని మంత్రులు అంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. ప్లీనరీ రెండవ రోజు భారీగా జనం వస్తారని భావిస్తున్న వైసీపీ నేతలు అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
YCP : దర్శి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య బుసలు కొడుతున్న వివాదం
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?