Adimoolapu Suresh: ఉక్రెయిన్లో తెలుగు విద్యార్ధులకు బాసట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మ. సంప్రదించాల్సిన నెంబర్ 7531904820 కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా అపాయింట్ చేశాం. ఏపీ భవన్ లో ఒక నోడల్ అధికారిని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించాం. వీరు ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులతో టచ్ లో ఉన్నారు. ఉక్రెయిన్లో జఫ్రూషా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. విమానాలు రద్దు అవుతున్న నేపథ్యంలో ఎక్కువ ఆందోళన నెలకొంది. ఇండియన్ ఎంబసీ ఇచ్చే సూచనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలన్నారు మంత్రి సురేష్. నిషేధిత ప్రాంతాలకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమన్వయంతో వుందన్నారు.
Also Read
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
ఇదిలా వుంటే ఉక్రెయిన్ దేశంలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 29 మంది విద్యార్థులు వున్నారు. ఉక్రెయిన్ లో చదువుతున్న తమ పిల్లలను క్షేమంగా భారతదేశానికి తీసుకు రావాలని ప్రధాని మోదీకి ట్విట్టర్లో మెసేజ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లల గురించి తమకెంతో ఆందోళనగా వుందన్నారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!