AB Venkateswara Rao: నా సస్పెన్షన్పై న్యాయపోరాటం చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తనపై ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెన్షన్ విధించడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై సస్పెండ్ చేస్తున్నట్టు జీవో ఇచ్చారని..ఛార్జీ షీట్ లేదు.. ట్రయల్ లేదు.. అయినా తాను సాక్షులను ప్రభావితం చేయడమేంటని ప్రశ్నించారు. ఏమీ లేని దానికి తనను సస్పెండ్ చేస్తూ జీవో ఇచ్చారని.. తనను మళ్లీ సస్పెండ్ చేయాలనే సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో..? ఏ పనికి మాలిన సలహాదారు ఇచ్చారో తెలియదన్నారు. తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవో లీగల్గా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ మీద ఛార్జీ షీట్లు ఉన్నాయని.. కేసులు ఉన్నాయని.. అయినా సీఎంగా కొనసాగుతున్నారుగా అంటూ ప్రశ్నించారు.
Read Also: రచ్చకెక్కుతున్న వైసీపీ సీనియర్లు..! సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు
Also Read
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
కేసులు ఎదుర్కొన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ పదవిలో కొనసాగుతున్నారని.. పదవిలో కొనసాగేందుకు ఆమెకు లేని అభ్యంతరం తనకే ఎందుకు అని ఏబీ వెంకటేశ్వరరావు నిలదీశారు. అసలు డబ్బులు ట్రాన్సక్షన్ జరగని కేసులో అవినీతి ఏంటని ప్రశ్నించారు. కొందరు ఆఫీసర్లు చేసే పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. తనను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని.. కొందరు వ్యక్తులు.. కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తగులబెట్టకుండా ఆపానని.. కోడి కత్తి దాడి సమయంలో గంటల్లోనే రాష్ట్రాన్ని తగులపెట్టాలని టార్గెటుగా పెట్టుకున్నారని.. తాను దాన్ని అడ్డుకున్నానని వివరించారు. అప్పట్లో రాష్ట్రం నాశనం కాకుండా తాను అడ్డుకోవడం ఇష్టం లేని వారు ఇప్పుడు తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మంది ఎమ్మెల్యేలు బతికే ఉన్నారని.. పార్టీని మారమని తానేమైనా ప్రేరేపించానేమోననే విషయాన్ని వారిని అడగొచ్చుగా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని రాజ్ భవన్ గేట్ దగ్గర తానేమన్నా మాట్లాడానా అంటూ నిలదీశారు. తనపై విధించిన సస్పెన్షన్పై న్యాయపోరాటం చేస్తానని.. ఐపీఎస్ సంఘం ఎందుకు స్పందించడం లేదో వాళ్లనే అడగాలన్నారు. సమాజంలో ఉన్న పురుగులను ఏరివేసే వ్యవసాయం చేస్తూనే ఉన్నానని.. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసే దాని కన్నా.. వ్యవసాయం చేసుకోవడం మేలని బమ్మెర పోతన చెప్పాడని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
-
Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు