South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: సంక్రాంతి రద్దీని దృష్టిని పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు మరో 30 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ఆయా రైళ్లలో రిజర్వుడ్, అన్ రిజర్వుడ్ బోగీలను అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్ధం రాత్రి సమయాల్లో ఈ రైళ్లు నడుస్తాయి.
Read Also: Cell Phones Robbery: పోలీస్ డ్రెస్ లో వచ్చి… సెల్ ఫోన్స్ చోరీ
Also Read
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
కాగా జనవరి 9న సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 10న కాకినాడ టౌన్ – వికారాబాద్, 11న వికారాబాద్ – నరసాపూర్, సికిందాబ్రాద్ – కాకినాడ టౌన్, 12న నరసాపూర్ – సికింద్రాబాద్, కాకినాడ టౌన్ – వికారాబాద్, 13న వికారాబాద్ – కాకినాడ టౌన్, సికింద్రాబాద్ – నరసాపూర్, 14న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, నరసాపూర్ – సికింద్రాబాద్, 15న సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, 16న సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – వికారాబాద్, 17న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్, వికారాబాద్ – కాకినాడ టౌన్, 18న కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ రైళ్లకు ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి అడ్వాన్స్డ్ రిజర్వేషన్ సౌకర్యం ప్రారంభం కానుంది. ఈ రైళ్లకు నడికుడి, సత్తెనపల్లిలో హాల్టింగ్ ఉంటుంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకుంటేపీఆర్ఎస్ కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్లో రిజర్వుడ్ టిక్కెట్లను బుకింగ్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. జనరల్ బోగీలలో ప్రయాణించదలిస్తే రైల్వేస్టేషన్లలో టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ దృష్ట్యా యూటీఎస్ మొబైల్ యాప్ని వినియోగించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..