2000 Notes Fraud: 2000 నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసం.. రూ.18 లక్షలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Biharis Cheated Panipuri People In The Name Of Exchange Of 2000 Notes: ఈరోజుల్లో దొంగలు చాలా తెలివి మీరారు. ఇంతకుముందులాగా ముసుగు కప్పుకొని దాడులు చేయకుండా.. ట్రెండ్కి తగిన వ్యూహాలు రచిస్తూ, దోపిడీలకు పాల్పడుతున్నారు. మాయమాటలు చెప్పి, జనాల్ని బురిడీ కొట్టిస్తూ, లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఫలానా పని కచ్ఛితంగా చేస్తామని బలంగా నమ్మించి, జనాలకు శఠగోపాలు పెడుతున్నారు. తాజాగా బీహార్కు చెందిన ముగ్గురు దొంగలు కూడా.. రూ.2000 నోట్ల మార్పిడి పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా రూ.18 లక్షలు తీసుకుని పారిపోయారు. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pakistan: పాకిస్థాన్లో కుండపోత.. 86 మంది మృతి, 151 మందికి గాయాలు
Also Read
కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లను రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ నోటుకి మార్కెట్లో ఇప్పుడు పెద్దగా విలువ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈ నోట్లను మార్చుకుంటున్నారు జనాలు. అయితే.. బీహార్కి చెందిన ముగ్గురు వ్యక్తులు మాత్రం, ఒక పెద్ద ప్లాన్ వేశారు. తమకు రూ.6 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.18 లక్షల విలువగల రూ. 2000 నోట్లను ఇస్తామని నమ్మబలికారు. అంటే.. ఒకటికి మూడింతల లాభం ఇస్తామని పానీపూరి నిర్వాహకుల్ని నమ్మించారు. దీంతో.. వాళ్లు టెంప్ట్ అయ్యారు. రెండు వేల నోట్ల మార్పిడికి ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఆఫర్తో తాము లక్షాధికారులం అవుతామని భావించి, ఈ డీల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Article 370: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రశాంతం.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు
డీల్ ప్రకారం.. పానీపూరి నిర్వాహకులు ఆ కేటుగాళ్లకు రూ.6 లక్షల విలువగల రూ.500 నోట్లను ఇచ్చారు. వాళ్లు ఒక బ్యాగ్ ఇచ్చి, అక్కడి నుంచి వెంటనే ఉడాయించారు. బాధితులు ఆ కేటుగాళ్లు ఇచ్చిన బ్యాగ్ ఓపెన్ చేయగా.. అందులో చిత్తు కాగితాలు ఉండటాన్ని గమనించారు. పైన నిజంగానే నోట్లు ఉన్నట్లు ఫేక్ నోట్లు పెట్టి, లోపల చిత్తుకాగితాలు కుక్కారు. దీంతో.. తాము మోసపోయామని భావించిన బాధితులు, వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?