IND Vs SA: గుడ్న్యూస్.. విశాఖ టీ20కి 100 శాతం ప్రేక్షకులకు ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే నెల 14వ తేదీన విశాఖలో నిర్వహించనున్న భారత్-దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్పై చర్చించారు. విశాఖలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా విశేషమైన స్పందన లభిస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్రెడ్డి వెల్లడించారు. విశాఖలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం 27 వేల మంది కెపాసిటీని కలిగి ఉందని.. ఈ మ్యాచ్కు తాము పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నట్లు తెలిపారు.
Cricket: టీమిండియా కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్
Also Read
విశాఖలో టీ20 మ్యాచ్ కోసం ఎక్కువ మొత్తంలో టిక్కెట్లను ఆన్లైన్లో పెడుతున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ గోపీనాథ్రెడ్డి చెప్పారు. రూ.5వేలు, రూ.2,500, రూ.500, రూ.250 ధరల్లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. 2019లో జరిగిన మ్యాచ్ కోసం 1,100 సిబ్బందిని పెట్టామని గుర్తుచేశారు. త్వరలో జరగనున్న మ్యాచ్కుట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మ్యాచ్కు వచ్చే సమయంలో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. అయితే మ్యాచ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్లే సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. వాటిని అధిగమించేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లేయర్స్ ఉండే హోటల్స్ దగ్గర పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..