షాకింగ్ సర్వే: ఆన్ లైన్ ట్రాకర్స్ చేతిలో యూజర్స్ హిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు రోజంతా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా? మీరు వెతికే వెబ్ సైట్లు, బ్యాంక్ వివరాలన్నీ హ్యాకర్స్ చేతికి చిక్కుతున్నాయంటే నమ్ముతారా? మీరు నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. హ్యాకర్స్ తమ టెక్నాలజీని ఉపయోగించి యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీని కనుక్కొని అందుకు అనుగుణంగా వినియోగదారులకు ఫోన్ చేసి వారి రహస్య సమాచారం సేకరిస్తున్నారు. వారి బ్యాంకింగ్ లావాదేవీలను తెలుసుకుని డబ్బులు లాగేస్తున్నారు.
బ్యాంకులకు సంబంధించి వినియోగదారులను బుట్టలో పడేస్తున్నారు. నార్టన్ కన్జ్యూమర్ సైబర్ సేఫ్టీ పల్స్ రిపోర్ట్ తాజాగా విభ్రాంతికర అంశాలను బయటపెట్టింది. దేశంలో జరుగుతున్న ఆన్ లైన్ మోసాలకు సంబంధించి కీలక సమాచారం వెల్లడిచేసింది. అంతగా సేఫ్టీ కాని కంప్యూటర్ డివైజ్ ల ద్వారా వారు సెర్చ్ చేసిన వెబ్ సైట్లు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. దాని ద్వారా వారికి ఫోన్లు చేసి మరీ వారి నుంచే సమాచారం అందుకుంటున్నారు. ఓటీపీల ద్వారా వారి బ్యాంకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
2 గంటల పాటు బ్రౌజ్ చేసిన హిస్టరీ చాలు స్కామర్లకు దోచేయడానికి. కాబట్టి వినియోగదారులు తాము ఏ డివైజ్ నుంచి సెర్చ్ చేసినా ఆ రోజు చివరిలో ఆ బ్రౌజింగ్ హిస్టరీనీ డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా సర్వేలో 80 శాతం మోసాలు బ్రౌజింగ్ హిస్టరీ ద్వారానే జరుగుతున్నాయని తేలింది. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ నిర్వహించిన సర్వేలో 18,769,678సైబర్ అటాక్స్ జరిగాయి. అందులో రోజుకి 2,04,311 మోసాలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 3.6 బిలియన్ సైబర్ మోసాల్లో 10 మిలియన్ సైబర్ మోసాలు రోజువారి జరిగాయి. 53.9 మిలియన్ ఫిషింగ్ అటెంప్ట్ లు జరిగాయని నార్టన్ సంస్థ తెలిపింది. అలాగే, ఫైల్ థ్రెట్స్ జరిగినవి ఏకంగా 221 మిలియన్లు, మొబైల్ థ్రెట్స్ జరిగినవి 1.4 మిలియన్లు. ర్యాన్ సమ్ వేర్ అటాక్స్ జరిగాయి. కాబట్టి ఆన్ లైన్ లో వుండే వినియోగదారులు తమ సెన్సిటివ్ సమాచారం పట్ల అప్రమత్తంగా వుండాలని నార్టన్ కన్జ్యూమర్ సైబర్ సేఫ్టీ పల్స్ రిపోర్ట్ హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!