షాకింగ్ సర్వే: ఆన్ లైన్ ట్రాకర్స్ చేతిలో యూజర్స్ హిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు రోజంతా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారా? మీరు వెతికే వెబ్ సైట్లు, బ్యాంక్ వివరాలన్నీ హ్యాకర్స్ చేతికి చిక్కుతున్నాయంటే నమ్ముతారా? మీరు నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. హ్యాకర్స్ తమ టెక్నాలజీని ఉపయోగించి యూజర్ల బ్రౌజింగ్ హిస్టరీని కనుక్కొని అందుకు అనుగుణంగా వినియోగదారులకు ఫోన్ చేసి వారి రహస్య సమాచారం సేకరిస్తున్నారు. వారి బ్యాంకింగ్ లావాదేవీలను తెలుసుకుని డబ్బులు లాగేస్తున్నారు.
బ్యాంకులకు సంబంధించి వినియోగదారులను బుట్టలో పడేస్తున్నారు. నార్టన్ కన్జ్యూమర్ సైబర్ సేఫ్టీ పల్స్ రిపోర్ట్ తాజాగా విభ్రాంతికర అంశాలను బయటపెట్టింది. దేశంలో జరుగుతున్న ఆన్ లైన్ మోసాలకు సంబంధించి కీలక సమాచారం వెల్లడిచేసింది. అంతగా సేఫ్టీ కాని కంప్యూటర్ డివైజ్ ల ద్వారా వారు సెర్చ్ చేసిన వెబ్ సైట్లు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. దాని ద్వారా వారికి ఫోన్లు చేసి మరీ వారి నుంచే సమాచారం అందుకుంటున్నారు. ఓటీపీల ద్వారా వారి బ్యాంకుల నుంచి డబ్బులు దోచేస్తున్నారు.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
2 గంటల పాటు బ్రౌజ్ చేసిన హిస్టరీ చాలు స్కామర్లకు దోచేయడానికి. కాబట్టి వినియోగదారులు తాము ఏ డివైజ్ నుంచి సెర్చ్ చేసినా ఆ రోజు చివరిలో ఆ బ్రౌజింగ్ హిస్టరీనీ డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజా సర్వేలో 80 శాతం మోసాలు బ్రౌజింగ్ హిస్టరీ ద్వారానే జరుగుతున్నాయని తేలింది. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ నిర్వహించిన సర్వేలో 18,769,678సైబర్ అటాక్స్ జరిగాయి. అందులో రోజుకి 2,04,311 మోసాలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 3.6 బిలియన్ సైబర్ మోసాల్లో 10 మిలియన్ సైబర్ మోసాలు రోజువారి జరిగాయి. 53.9 మిలియన్ ఫిషింగ్ అటెంప్ట్ లు జరిగాయని నార్టన్ సంస్థ తెలిపింది. అలాగే, ఫైల్ థ్రెట్స్ జరిగినవి ఏకంగా 221 మిలియన్లు, మొబైల్ థ్రెట్స్ జరిగినవి 1.4 మిలియన్లు. ర్యాన్ సమ్ వేర్ అటాక్స్ జరిగాయి. కాబట్టి ఆన్ లైన్ లో వుండే వినియోగదారులు తమ సెన్సిటివ్ సమాచారం పట్ల అప్రమత్తంగా వుండాలని నార్టన్ కన్జ్యూమర్ సైబర్ సేఫ్టీ పల్స్ రిపోర్ట్ హెచ్చరిస్తోంది.
తాజావార్తలు
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..