సీఎం మళ్లీ ఢిల్లీకి.. ఎప్పుడంటే… ఎందుకంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారా? త్వరలోనే ఆయన దేశ రాజధానిలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవనున్నారా? ఈ ప్రశ్నలకు.. అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే.. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంట్ సైతం జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సమావేశం ఖరారైతే.. జగన్ ఢిల్లీ బయల్దేరే అవకాశం ఉంది.
ఈ ఊహాగానాలు నిజమై ఢిల్లీకి వెళ్తే.. జగన్ ఏం చేయబోతున్నారు? కేంద్రం నుంచి ఎలాంటి హామీ తీసుకోబోతున్నారు? సంక్షేమ పథకాలను ఎలా పరుగులు పెట్టించబోతున్నారు? ఇతరత్రా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? అన్నది ఆంధ్రా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే.. రాష్ట్రం అప్పుల కారణంగా కాస్త ఇబ్బంది పడుతోంది. అవకాశం ఉన్న చోట.. ఆర్థిక వనరులు సమకూర్చుకుంటోంది. పథకాలను సరిగ్గా అమలు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
మరోవైపు.. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాలకు పెట్టిన పరిమితి నిబంధనలు.. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఆర్థిక కష్టాలకు కారణాలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మందగించిన ఆర్థిక స్థితి సైతం కాస్త ఇబ్బందికరంగానే పరిణమిస్తోంది. ఈ విషయాలను ఇప్పటికే.. కేంద్రం దృష్టికి సీఎం జగన్ తీసుకువెళ్లారు. మరోసారి ఈ విషయాన్ని వివరించి.. ఆర్థిక అండను కోరే అవకాశం ఉంది.
అలాగే.. అప్పులపై ఉన్న పరిమితి నుంచి రాష్ట్రానికి కాస్తైనా వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈ రెండు ప్రయత్నాల్లో ఏ ఒక్కటి సఫలమైనా.. సంక్షేమ పథకాలను సజావుగా ముందుకు తీసుకుపోవచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే.. ఎంత కష్టమైనా జనం ఆనందంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతూ.. పథకాలను అమలు చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో.. అటు ప్రజల్లో మాట పోకుండా.. ఇటు ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బంది ఎదురు కాకుండా ఉండేలా.. ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే.. ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలకు రాష్ట్ర పరిస్థితులు వివరించి.. తగిన సహాయాన్ని అర్థించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే.. జగన్ ఢిల్లీ పర్యటనపై.. పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!