సీఎం మళ్లీ ఢిల్లీకి.. ఎప్పుడంటే… ఎందుకంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారా? త్వరలోనే ఆయన దేశ రాజధానిలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవనున్నారా? ఈ ప్రశ్నలకు.. అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే.. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంట్ సైతం జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సమావేశం ఖరారైతే.. జగన్ ఢిల్లీ బయల్దేరే అవకాశం ఉంది.
ఈ ఊహాగానాలు నిజమై ఢిల్లీకి వెళ్తే.. జగన్ ఏం చేయబోతున్నారు? కేంద్రం నుంచి ఎలాంటి హామీ తీసుకోబోతున్నారు? సంక్షేమ పథకాలను ఎలా పరుగులు పెట్టించబోతున్నారు? ఇతరత్రా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? అన్నది ఆంధ్రా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే.. రాష్ట్రం అప్పుల కారణంగా కాస్త ఇబ్బంది పడుతోంది. అవకాశం ఉన్న చోట.. ఆర్థిక వనరులు సమకూర్చుకుంటోంది. పథకాలను సరిగ్గా అమలు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
Also Read
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
మరోవైపు.. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాలకు పెట్టిన పరిమితి నిబంధనలు.. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఆర్థిక కష్టాలకు కారణాలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మందగించిన ఆర్థిక స్థితి సైతం కాస్త ఇబ్బందికరంగానే పరిణమిస్తోంది. ఈ విషయాలను ఇప్పటికే.. కేంద్రం దృష్టికి సీఎం జగన్ తీసుకువెళ్లారు. మరోసారి ఈ విషయాన్ని వివరించి.. ఆర్థిక అండను కోరే అవకాశం ఉంది.
అలాగే.. అప్పులపై ఉన్న పరిమితి నుంచి రాష్ట్రానికి కాస్తైనా వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈ రెండు ప్రయత్నాల్లో ఏ ఒక్కటి సఫలమైనా.. సంక్షేమ పథకాలను సజావుగా ముందుకు తీసుకుపోవచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే.. ఎంత కష్టమైనా జనం ఆనందంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతూ.. పథకాలను అమలు చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో.. అటు ప్రజల్లో మాట పోకుండా.. ఇటు ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బంది ఎదురు కాకుండా ఉండేలా.. ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే.. ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలకు రాష్ట్ర పరిస్థితులు వివరించి.. తగిన సహాయాన్ని అర్థించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే.. జగన్ ఢిల్లీ పర్యటనపై.. పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?