Karonda Cultivation: వాక్కాయల సాగుతో అదిరిపోయే లాభాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాక్కాయాలతో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.. అందుకే వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. అందుకే రైతులు కూడా వీటిని పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అధిక దిగుబడులను ఒక్క ఆహార పంటల ద్వారా రైతులు వ్యవసాయంలో పొందలేకపోతున్నారు.. అందుకే తక్కువ సమయంలో అధిక లాభాలను ఇచ్చే పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు.. వాక్కాయ సాగుతో రైతులు అధిక రాబడిని పొందుతున్నారు.. ఈ పంట గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
థాయిలాండ్ వెరైటీ మొక్క నాటిన మొదటి ఏడాది నుంచే కాపు అందుకుంటుంది. నేలమీదా, కుండీల్లోనూ అన్ని చోట్ల దీనిని పెంచుకోవచ్చు. ఎర్రమట్టి నేలల్లో శ్రీఘ్రమైన కాపు ఉంటుంది. వారానికి ఒకరోజు నీటివనరులు అందిస్తే సరిపోతుంది. సాధారణంగా వాక్కాయ మొక్క అక్కడక్కడా ముళ్ళుండే పొద జాతి, కంప మొక్క…విదేశీ మొక్కలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి..వీటిలో అధికంగా విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, ఫైటో న్యూట్రియంట్స్, అంథోసైనిన్స్, ఫినోలిక్ యాసిడ్స్, అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పాలిఫినల్స్ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తుంది. తినుబండారాలలో వాడే చెర్రీ పండ్లు ఈ పండ్ల నుంచి తయారుచేస్తారు.. అందుకే ఇవి చాలా ఖరీదైనవి..
Also Read
- Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో
- Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
- Best Buffalo Breed: డెయిరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా?.. రోజుకు 25 లీటర్లు ఇచ్చే ఈ గేదెలను కొనండి!
- Potato Farming : కొత్త టెక్నాలజీ.. భూమిలో కాకుండా గాల్లో ఆలుగడ్డ పండిస్తున్న వైనం
బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు తన కున్న మొత్తం పొలంలో ఈ వాక్కాయాలను సాగు చేస్తున్నాడు..పొలం గట్టుపై వేస్తే కంచెగా ఉంటుందని రైతులు భావించారు. పొలంలో గట్టుపై దీనిని నాటారు. పెరిగాక దాని కాయలను విత్తనాలుగా మార్చి ఎకరం పొలంలో సాగు చేస్తే లాభాలు రావడంతో ప్రస్తుతం 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఎకరానికి 200 మొక్కలు నాటవచ్చు.. అలా ఆ ప్రాంతం అంతా తొలి ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా చెట్టు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగిందని రైతులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఒక చెట్టుకు 25 నుంచి 30 కిలోల వాక్కాయలు వచ్చాయి. ఎకరానికి సుమారు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్ ధర కిలో రూ.50 ఉంది. అడవి జాతి మొక్క కావడంతో పెట్టుబడి ఖర్చు తక్కువ.. ఒక్కసారి నీరు పెడితే చాలు మొక్కలు అవే పెరుగుతాయి.. చెర్రీ పండ్లను వీటితో తయారుచేస్తారు.వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా వాక్కాయలతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు.. సో ఈ పంటను వ్యవసాయ నిపుణుల సలహాతో పండించవచ్చు..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..