Honeymoon: హనీమూన్ కోసం పెళ్లి విందు వేలం.. సోషల్ మీడియాలో దుమారం”
- అలాస్కా హనీమూన్ కోసం పెళ్లి విందు వేలం
- మొదటి ప్లేట్ భోజనానికి రూ.1.29 లక్షల చెల్లింపు
- సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన క్షణం. ఇంట్లో ఉత్సాహం, కొత్త కలలు, ఆత్మీయుల సందడి, రుచికరమైన విందు – ఇవన్నీ ఆ వేడుకను మరింత అందంగా మార్చుతాయి. సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులకు గౌరవం ఇవ్వడం, వారికి రుచికరమైన భోజనం వడ్డించడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే ఇటీవల ఓ పెళ్లిలో జరిగిన వింత సంఘటన సోషల్ మీడియాలో సంచలనం రేపింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటనలో, పెళ్లి విందును అతిథుల ముందే వేలం వేసారు. సమాచారం ప్రకారం, వధూవరులు అతిథులను కూర్చోబెట్టి, “మొదటి ప్లేట్ భోజనాన్ని వేలానికి పెడుతున్నాం. దానిని ఎవరు కొనుగోలు చేస్తారో వారికి ముందుగా వడ్డిస్తాం. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో మేము అలాస్కాకు హనీమూన్ వెళ్తాం,” అని ప్రకటించారు. ఆశ్చర్యకరంగా, ఒక అతిథి రూ.1,29,285 చెల్లించి ఆ తొలి ప్లేట్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మిగతా అతిథులకు సాధారణంగా భోజనం వడ్డించారు.
Also Read
- SBI ATM Theft: అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం.. ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారుగా.!
- Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
- Viral Video: అమ్మ పెళ్లి చేస్తోందని గుండు చేయించుకున్న అమ్మాయి? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదేనట!
- Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
Tamil Nadu: భార్యపై దాడి చేసి, ఆస్పత్రిలో ఉన్నా కనికరం లేకుండా దారుణహత్య..
ఈ విషయం @turbothad అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయబడటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అనేక మంది నెటిజన్లు ఈ చర్యను అవమానకరంగా, అసభ్యకరంగా అభివర్ణిస్తున్నారు. “మీ పెళ్లిలో ఒక ప్లేట్ భోజనం కోసం డబ్బు వసూలు చేయడం సిగ్గుచేటు. మీ స్నేహితులు, బంధువులు ఇప్పటికే డబ్బు, సమయం వెచ్చించి మీ పెళ్లికి వస్తున్నారు,” అని పలువురు విమర్శిస్తున్నారు.
మరికొందరు “ఇలాంటి పెళ్లిలో ఒక్క నిమిషం కూడా ఉండం,” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పెళ్లిళ్లు డబ్బు సంపాదన కోసం వ్యాపారాలుగా మారిపోతున్నాయని తీవ్రంగా మండిపడుతున్నారు.
Shashi Tharoor: నాకు పార్టీ కన్నా దేశం ముఖ్యం.. కాంగ్రెస్కు థరూర్ షాక్..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!