Nagpur: మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు దొంగగా మారిన భర్త..
- కరోనాలో పెళ్లి చేసుకుని కొన్నాళ్లకే భార్యకు విడాకులు..
- కోర్టు ఆదేశాల ప్రకారం నెల నెల మాజీ భార్యకు భరణం..
- భరణం డబ్బుల కోసం చైన్ స్నాచింగ్కు పాల్పడిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur: వివాహ బంధంలో కలహాలు వచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం అనేక కుటుంబాల్లో కనిపిస్తుంది. ఇక, విడాకులు తీసుకున్న తరువాత చాలా మంది భర్తలు కోర్టు ఆదేశాలతో మేరకు తమ మాజీ భార్యలకు భరణం చెల్లిస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది వారికి తలకు మించిన భారం అవుతుంది. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నగరంలోని గణపతినగర్కు చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే వ్యక్తి కోర్టు ఆదేశాల ప్రకారం తన మొదటి భార్యకు నెలకు రూ.6 వేల భరణం చెల్లించాల్సి ఉంది. ఇక, తాను నిరుద్యోగిగా ఉండటంతో ఆ డబ్బులు ఎలాగైనా ఇవ్వాలని చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. ఇటీవల మనీష్నగర్లో జరిగిన ఓ చైన్ స్నాచింగ్ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Shah Rukh Khan : ‘కింగ్’ మూవీ కి బ్రేక్.. షూటింగ్లో షారుఖ్కు అపశ్రుతి..?
Also Read
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
- Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
అయితే, 2024 ఫిబ్రవరి 22వ తేదీన 74 ఏళ్ల వృద్ధురాలు జయశ్రీ జయకుమార్ గడే మెడలో ఉన్న బంగారు గొలుసును బైక్పై వచ్చి లాక్కెళ్లాడు. బెల్టరోడి పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. విచారణలో కన్హయ్యను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అతను తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు, కోవిడ్ సమయంలో వివాహం చేసుకోగా.. గొడవ వల్ల భార్యతో విడాకాలు తీసుకున్నాడు.. ఇక, కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ భార్యకు నెలవారీ భరణం చెల్లించాల్సి రావడంతో.. రెండేళ్లుగా ఉద్యోగం లేకపోవడంతో.. డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
Read Also: EX Minister Sailajanath: చంద్రబాబే నిజమైన రాయలసీమ ద్రోహి
ఇక, అతడు దొంగిలించిన బంగారు చైన్ లలో కొన్నింటిని స్థానిక నగల దుకాణంలో విక్రయించినట్లు పోలీసులు చెప్పుకొచ్చాడు. దొంగ సొమ్ము కొనుగోలు చేసినందుకు ఆ షాప్ యాజమానిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, కన్హయ్య దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్, 10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కన్హయ్యతో పాటు నగల వ్యాపారి ఇద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. తదిపరి దర్యాప్తు కోసం వారిని బెల్టరోడి పోలీసులకు అప్పజెప్పారు.
తాజావార్తలు
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Rythu Bharosa : రైతులకు పెట్టుబడి సాయం.. మరో రూ.1,009 కోట్లు విడుదల
-
AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
-
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
-
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!