12 నిమిషాల్లో 11 కి.మీ ప్రయాణించిన గుండె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్య పరంగా హైదరాబాద్లో ఓ అరుదైన సంఘటన జరిగింది. గుండెను మలక్పేట నుంచి పంజాగుట్టకు పన్నెండు నిమిషాల్లో తరలించారు. రెండు ప్రాంతాల మధ్య దూరం పదకొండు కిలో మీటర్లు. ఈ గుండె కోసం అక్కడో ప్రాణం ఎదురుచూస్తోంది. అదృష్టం కొద్దీ అనుకున్న సమయానికి చేరి ప్రాణాలు నిలబెట్టింది.
గుండె మార్పిడి ఆపరేషన్ కోసం గ్రీన్ ఛానల్ ద్వారా మలక్ పేటలోని ఓ ఆస్పత్రి నుంచి పంజాగుట్టలోని 12 నిమిషాల్లో గుండెను తీసుకెళ్లారు. గుండెను తరలించే క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు ముందే ఏర్పాట్లు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి వైద్యులు ఈ గుండెను అమర్చనున్నారు. జీవన్దాన్లో నమోదు చేయించుకున్న 24 గంటల్లోనే అతనికి గుండె దొరకడం విశేషం. ఇది చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
- Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
- పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
- Sreesanth Challenges Harbhajan: "దమ్ముంటే రింగ్లోకి రా.!" హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వీరబాబు.. కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న విధులకు వెళ్తుండగా గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు మంగళవారం తెలిపారు. అయితే మృతుడి హృదయాన్ని దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో పంజాగుట్టలోని నిమ్స్లో చికిత్స పొందుతున్న ఓ రోగికి మృతుడి గుండెను మార్పిడి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అధికారులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. మలక్ పేటలోని యశోద ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 1.44 గంటలకు ప్రత్యేక అంబులెన్స్ లో గుండెను తీసుకుని పంజాగుట్టలోని నిమ్స్ కు బయలుదేరారు. మధ్యాహ్నం 1:56గంటలకు గుండె పంజాగుట్ట నిమ్స్కి చేరింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయటం వల్ల ఎలాంటి ట్రాఫిక్ లేకపోవడంతో కేవలం 12 నిమిషాల్లో గుండెను అక్కడికి చేర్చారు.
ఇలా ఎన్నో కేసులు ఆస్పత్రులకు వస్తుంటాయి. కానీ అనుకున్న సమయానికి అవయవాలు అందరికీ అందవు. అవసరం ఎక్కువ..లభ్యత తక్కువ. అందుకే జీవన్దాన్ నెట్వర్క్తో లింక్ చేసిన ఆసుపత్రులకు రొటేషన్ విధానంలో అవసరమైన వారికి అవయవాలు అందేలా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆసుపత్రులు 30 ఉన్నాయి. వీటిలో అన్ని వివరాలు ఉంటాయి. దాంతో ఇక్కడ ఏ ఫైరవీ పనిచేయదు. ఈ 30 ఆసుపత్రులకే ఒక రోగిని బ్రెయిన్డెడ్గా నిర్ణయించే అర్హత, అవయవమార్పిడి చేసే అర్హత ఉన్నాయి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇప్పటివరకూ 30 ఆస్పత్రులకు మాత్రమే అనుమతినిచ్చారు.
పుట్టిన మనిషి గిట్టక తప్పదు. చనిపోయినా సజీవంగా ఉండాలంటే అవయవ దానం చేయండి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “నువ్వు గ్రేట్ రా బుడ్డోడా”.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని నిలబెట్టిన వైభవ్..
-
Janhvi Kapoor : బాయ్ ఫ్రెండ్ తో మ్యారేజ్ ఫిక్సా? వైరల్ ఫొటోతో వార్తల్లోకి జాన్వీ పెళ్లి
-
ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
-
Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
-
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!