NTV Telugu Site icon

Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు

Viral News

Viral News

బీహార్‌లోని గయా జిల్లాలో ఓ పేద కూలీకి ఆదాయపు పన్ను శాఖ రూ.2 కోట్లకు పైగా పన్ను నోటీసులిచ్చిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చమురు వ్యాపారి వద్ద నెలకు రూ.10 వేల చొప్పున కూలీగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ వర్మకు రూ.2 కోట్ల 3 వేల 308 పన్ను చెల్లించాలని నోటీసు వచ్చింది. రూ. 67 లక్షల జరిమానా కూడా 2 రోజుల్లో చెల్లించాలని నోటీసులో పేర్కొంది. రాజీవ్ ఎప్పుడూ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని తేలడంతో విషయం మరింత క్లిష్టంగా మారింది. ఇంత తక్కువ ఆదాయంతో రిటర్నులు దాఖలు చేయడం కూడా తనకు తెలియదని బాధితుడు అంటున్నాడు.

READ MORE: Ra Macha : రా మచ్చా.. రామ్ అచ్చా!

రూ.2 కోట్ల నోటీసు ఎందుకు వచ్చాయి?
వాస్తవానికి.. 2015లో రాజీవ్ కార్పొరేషన్ బ్యాంక్‌లో రూ. 2 లక్షల ఎఫ్‌డి చేసినట్లు తెలిపాడు. అతనకు అత్యవసరం పడటంతో 2016లో ఈ ఎఫ్‌డీని బ్రేక్ చేసి నగదు తిరిగి తీసుకున్నాడు. దీని తర్వాత పాత గోదాములో పనిచేయడం ప్రారంభించాడు. అయితే అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ రూ. 2 కోట్ల 3 వేల 308 పన్ను నోటీసు పంపి అతని సమస్యలను పెంచింది. 2015-16లో రాజీవ్‌ రూ.2 కోట్ల ఎఫ్‌డీ చేశాడని, ఆ పన్ను ఇంకా చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది.

READ MORE:Devara : ముందు నుంచీ స్లో పాయిజనే అబ్బా!!!

గత నాలుగు రోజులుగా పనికి వెళ్లేందుకు జంకుతున్న బాధితుడు
ఆదాయపు పన్ను శాఖ నోటీసు రాజీవ్ జీవితంలో పెను తుఫాను తెచ్చింది. గత 4 రోజులుగా పనికి వెళ్లడం లేదు. విసుగు చెందిన అతను గయాలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ అధికారులు పాట్నాకు వెళ్లమని తనకు సూచించారు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పన్ను శ్లాబ్‌లో తక్కువగా ఉన్న ఒక పేద వ్యక్తికి రూ. 2 కోట్లకు పైగా పన్ను నోటీసు పంపబడింది. మరి ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, రాజీవ్‌కు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.