India EV Market: ఏటా కోటి విద్యుత్ వాహనాల విక్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India EV market: మరో ఏడేళ్లలో మన దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలే కనిపించనున్నాయి. ఎందుకంటే ఆ వాహనాల అమ్మకాలు 2030 నాటికి ఏటా కోటి యూనిట్లకు చేరుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక సర్వే-2023 పేర్కొంది. భారతదేశం హరిత ఇంధనం దిశగా పయనించటంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ కీలక పాత్ర పోషించనుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది.
2022 నుంచి 2030 వరకు దేశీయ విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 49 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని వెల్లడించింది. ఈవీ మార్కెట్ 2030 నాటికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఈవీ ఇండస్ట్రీ ఈ స్థాయిలో గ్రోత్ రేట్ సాధించేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
Also Read
- Upendra Dwivedi: పాక్కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read more: Indian Box Office Report: సినిమా హాల్స్ ఇక క్లోజ్ అనే డౌట్లు పటాపంచలు
ముఖ్యంగా.. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపజేయటాన్ని ఆర్థిక సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ తయారీ పెరిగితే ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకం పెరుగుతుందని పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి 2027 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనున్న ఈ పథకం కింద ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానిఫ్యాక్షరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్.. ఎఫ్ఏఎంఈ.. ఫేమ్.. అనే పథకం రెండో దశ 2019వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇందులో భాగంగా 10 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, ఇప్పటికే 7 లక్షలకు పైగా విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకం అందించామని గుర్తుచేసింది. 7 వేల 210 ఇ-బస్లకు అనుమతించగా అందులో 2 వేల 172 బస్సులు గతేడాది డిసెంబర్ లోపే అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక సర్వే-2023 వివరించింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!