PM Modi : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వడానికి ఇ-మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS 2024) ప్రకటించింది.
India EV market: మరో ఏడేళ్లలో మన దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలే కనిపించనున్నాయి. ఎందుకంటే ఆ వాహనాల అమ్మకాలు 2030 నాటికి ఏటా కోటి యూనిట్లకు చేరుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక సర్వే-2023 పేర్కొంది. భారతదేశం హరిత ఇంధనం దిశగా పయనించటంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ కీలక పాత్ర పోషించనుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2022 నుంచి 2030 వరకు దేశీయ విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 49 శాతం వృద్ధి రేటును నమోదు…