షి టీమ్స్ వల్ల తెలంగాణలో మహిళలకు మరింత భద్రత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు దఫాల పోలీసు పోస్టులు 27 వేల పోస్టులు భర్తీ చేశాము అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 2014 లో షి టీమ్స్ ఏర్పాటు చేసాము, ఇప్పటి వరకు 10 వేల మంది బాధితులకు న్యాయం జరిగింది. సీసీ కెమెరాల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయి. 99% చైన్ స్నాచింగ్ నేరాలు తగ్గాయి. వ్యక్తిగతంగా హత్యలు జరిగాయి వాటిని అదుపు చేస్తాం అని అన్నారు.
ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ… 3 పోలీస్ కమిషనరేట్ పరిధిలో 60 ద్విచక్ర వాహనాల్లో సిబ్బందికి అందజేశాం. వీటి వల్ల మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. షి టీమ్స్ ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు మరింత భద్రత ఏర్పడింది. తెలంగాణ ముడు పోలీస్ కమిషనరెట్ పరిధిలో 6లక్షల 50 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము అని పేర్కొన్నారు.