విద్యాసంస్థల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. కేవలం ఆన్లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. అయితే, తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన జరుగుతుందనే ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. ఇక, విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేనతో కలిసి సందర్శించిన మంత్రి.. పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించి, విద్యార్థుల.. ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఆలోచించి.. విద్యాసంస్థల పునః ప్రారంభంపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారని వెల్లడించారు.
సెప్టెంబర్ 1వ తేదీ వరకు పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి… రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను యుద్ధ పాత్రిపదికన సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. అన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారని, ఇదే స్ఫూర్తి ముందు కొనసాగాలన్నారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్న ఆమె.. పంచాయతీల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో చైర్మన్, కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో మేయర్, కార్పొరేటర్లు పాఠశాలలను సందర్శించి, వసతులు ఇతరత్రా ఏర్పాట్లను పరిశీలించాలని స్పష్టం చేశారు. వైరల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. శానిటైజేషన్ పనులను నిర్వహించాలని.. అన్ని రకాల కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!