ప్రైవేటు ఆర్టీపీసీఆర్ లాబ్స్ ను ఆకస్మికంగా తనిఖీలు చేసారు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి. ప్రభుత్వం నిర్ధేశించిన ధర కంటే అధిక రుసుములు వసూళ్ళు చేస్తే కఠిన చర్యలు తప్పవు అని పేర్కొన్నారు. మైక్రో లాబ్, మైల్ స్టోన్ లాబ్ కు లక్ష రూపాయల జరిమానా విధించారు. యూనటస్ లాబ్ పై కూడా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన పరీక్షల శాంపిల్స్ ను కావాలనే ప్రైవేటు లాబ్స్ వారు ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి ఇకనుండి ప్రతి ప్రైవేట్ లాబ్ కు ఒక డిప్యూటీ తహసీల్దార్ ను ఇంచార్జ్ గా నియమించి కోవిడ్ నిర్ధారణ పరీక్షల ఫలితాల వెల్లడిలో జాప్యాన్ని అరికడతాం అని చెప్పిన జేసీ ప్రశాంతి ప్రతిరోజు 6వేలకు పైగా RTPCR టెస్టులు చేస్తున్నాం అని పేర్కొన్నారు.