ఏపీ ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ
తిరుపతి ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ఈ ఉపఎన్నికలో 25 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో యరపీ ఎన్నికల అధికారికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలకు పాల్పడేందుకు ప్రణాళికలు చేసిందని నిఘా పెంచాలని కోరారు. రిగ్గింగ్, హింస ను ప్రేరేపించేందుకు పెద్ద ఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారన్న చంద్రబాబు.. అదనపు బలగాలను దించాలని కోరారు. నకిలీ ఓట్లు పోల్ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అటు చంద్రబాబు లేఖ రాయడం పై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఓటమి భయంతో ఇలా చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఇది ఇలా ఉండగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించారు. మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరుతో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు గ్రామస్థులు. గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించడంతో ఒక్క ఓటరూ రాక బోసిపోయింది ఊరందూరు పోలింగ్ స్టేషన్. ఇప్పటికి ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి నెలకొంది.
Also Read
- Tags
- ap
- chandrababu
- Tirupathi
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!