Pudding and Mink Drugs case: డ్రగ్స్ కేస్ FIRలో కీలకాంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసు ఎఫ్ ఐ ఆర్ లో మొత్తం నలుగురు నిందితులు చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు.నిందితులుగా అనిల్, అభిషేక్ , కిరణ్ రాజ్, అర్జున్. పరారీలో అర్జున్, కిరణ్ రాజ్ ల కోసం గాలిస్తున్న పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ అయిన అనిల్, అభిషేక్ లను రిమాండ్ కు తరలించనున్నారు పోలీసులు.
డ్రగ్స్ కేస్ FIRలో కీలకాంశాలు వున్నాయని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. శనివారం అర్ధ రాత్రి దాటిన తరువాత 1:40 కు పబ్ కు సంబంధించిన సమాచారం వచ్చింది. రాడిసన్ బ్లు హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో తెల్లవారుజామున 4 గంటలకు కోకైన్ సరఫరా చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఈజీ మనీ కోసమే డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు.
Also Read
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఉన్నత అధికారులకు సమాచారం చేరవేశారు సిబ్బంది. 1985 NDPS యాక్ట్ u/s 42(2) కింద కేస్ నమోదు చేశారు. క్లూస్ టీమ్ కు సమాచారం అందించారు పోలీసులు. పబ్ పై 2 గంటల ప్రాంతంలో లో దాడి చేశారు. దాడి చేసే ముందు తమ వెంట ల్యాప్ టాప్,మిని ప్రింటర్ , వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వెంట తీసుకెళ్ళారు పోలీసులు. పబ్ లో కి ఎంటర్ కాగానే మేనేజర్ అనిల్ కుమార్ ను కలిసి దాడి సమాచారం ఇచ్చాం అని ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు తెలిపారు.
క్లూస్ టీమ్ తో కలిసి పబ్ పై దాడి చేశాం. పబ్ లో అనిల్ , ప్రవీణ్ లను మధ్యవర్తులు పెట్టుకుని వారి సమక్షం లో దాడులు చేశాం. మేనేజర్ అనిల్ కుమార్ వద్ద ప్లాస్టిక్ ట్రే లో కొకైన్ కు స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 5 ప్యాకెట్లు లలో 4.64 గ్రాములు తెల్ల పౌడర్ స్వాధీనం. పబ్ లోనే ఉన్న పార్టనర్ అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నాం. అభిషేక్ మొబైల్ స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఐఆర్ లో తెలిపారు.

Fir Copy
ఎఫ్ ఐ ఆర్ వివరాలు:
క్రైమ్ నంబర్ 226/2022 u/S 8(c), 22(b),29(1) of NDPS చట్టం 1985 కేసు నమోదు.
నిందితులు వివరాలు:
A1)మహదరం అనిల్ కుమార్
A 2)అభిషేక్ వుప్పాల
A 3)అర్జున్ వీరమాచినేని
A4)కిరణ్ రాజు
స్వాధీనం చేసుకున్న మెటీరియల్:
S-1 బరువు 1 గ్రాము, S-2 బరువు 0.64 గ్రాములు, S-3 బరువు 0.93 గ్రాములు, S-4 1 గ్రాము మరియు S-5 బరువు 1.07 గ్రాములు
(మొత్తం – 4.64 గ్రాములు) స్వాధీనం
బార్ కౌంటర్ నుండి స్ట్రాస్, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్తో పాటు రెండు కేడీ (ప్లాస్టిక్ ట్రే) స్వాధీనం
216సిగిరెట్ పీకలు సైతం స్వాధీనం
DI Samsung Galaxy S22, మరియు Apple iPad 5
మోడల్ ఫోన్ స్వాధీనం
ల్యాప్టాప్, మినీ-ప్రింటర్, వెయింగ్ మెషీన్ మరియు ప్యాకింగ్ మెటీరియల్తో రాడిసన్ బ్లూ హోటల్ 1వ అంతస్తులో లోని పబ్ లో స్వాధీనం
తాజావార్తలు
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
-
Kajal Aggarwal : సమంత, రకుల్కు కాజల్ అగర్వాల్ సంచలన సవాల్!
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!