Pudding and Mink Drugs case: డ్రగ్స్ కేస్ FIRలో కీలకాంశాలు
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసు ఎఫ్ ఐ ఆర్ లో మొత్తం నలుగురు నిందితులు చేర్చారు బంజారాహిల్స్ పోలీసులు.నిందితులుగా అనిల్, అభిషేక్ , కిరణ్ రాజ్, అర్జున్. పరారీలో అర్జున్, కిరణ్ రాజ్ ల కోసం గాలిస్తున్న పోలీసులు. ఇప్పటికే అరెస్ట్ అయిన అనిల్, అభిషేక్ లను రిమాండ్ కు తరలించనున్నారు పోలీసులు.
డ్రగ్స్ కేస్ FIRలో కీలకాంశాలు వున్నాయని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. శనివారం అర్ధ రాత్రి దాటిన తరువాత 1:40 కు పబ్ కు సంబంధించిన సమాచారం వచ్చింది. రాడిసన్ బ్లు హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో తెల్లవారుజామున 4 గంటలకు కోకైన్ సరఫరా చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఈజీ మనీ కోసమే డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు.
Also Read
- Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
- 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
- 165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
- వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఉన్నత అధికారులకు సమాచారం చేరవేశారు సిబ్బంది. 1985 NDPS యాక్ట్ u/s 42(2) కింద కేస్ నమోదు చేశారు. క్లూస్ టీమ్ కు సమాచారం అందించారు పోలీసులు. పబ్ పై 2 గంటల ప్రాంతంలో లో దాడి చేశారు. దాడి చేసే ముందు తమ వెంట ల్యాప్ టాప్,మిని ప్రింటర్ , వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వెంట తీసుకెళ్ళారు పోలీసులు. పబ్ లో కి ఎంటర్ కాగానే మేనేజర్ అనిల్ కుమార్ ను కలిసి దాడి సమాచారం ఇచ్చాం అని ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు తెలిపారు.
క్లూస్ టీమ్ తో కలిసి పబ్ పై దాడి చేశాం. పబ్ లో అనిల్ , ప్రవీణ్ లను మధ్యవర్తులు పెట్టుకుని వారి సమక్షం లో దాడులు చేశాం. మేనేజర్ అనిల్ కుమార్ వద్ద ప్లాస్టిక్ ట్రే లో కొకైన్ కు స్వాధీనం చేసుకున్నాం. మొత్తం 5 ప్యాకెట్లు లలో 4.64 గ్రాములు తెల్ల పౌడర్ స్వాధీనం. పబ్ లోనే ఉన్న పార్టనర్ అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నాం. అభిషేక్ మొబైల్ స్వాధీనం చేసుకున్నామని ఎఫ్ఐఆర్ లో తెలిపారు.

Fir Copy
ఎఫ్ ఐ ఆర్ వివరాలు:
క్రైమ్ నంబర్ 226/2022 u/S 8(c), 22(b),29(1) of NDPS చట్టం 1985 కేసు నమోదు.
నిందితులు వివరాలు:
A1)మహదరం అనిల్ కుమార్
A 2)అభిషేక్ వుప్పాల
A 3)అర్జున్ వీరమాచినేని
A4)కిరణ్ రాజు
స్వాధీనం చేసుకున్న మెటీరియల్:
S-1 బరువు 1 గ్రాము, S-2 బరువు 0.64 గ్రాములు, S-3 బరువు 0.93 గ్రాములు, S-4 1 గ్రాము మరియు S-5 బరువు 1.07 గ్రాములు
(మొత్తం – 4.64 గ్రాములు) స్వాధీనం
బార్ కౌంటర్ నుండి స్ట్రాస్, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్తో పాటు రెండు కేడీ (ప్లాస్టిక్ ట్రే) స్వాధీనం
216సిగిరెట్ పీకలు సైతం స్వాధీనం
DI Samsung Galaxy S22, మరియు Apple iPad 5
మోడల్ ఫోన్ స్వాధీనం
ల్యాప్టాప్, మినీ-ప్రింటర్, వెయింగ్ మెషీన్ మరియు ప్యాకింగ్ మెటీరియల్తో రాడిసన్ బ్లూ హోటల్ 1వ అంతస్తులో లోని పబ్ లో స్వాధీనం
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!